Movies1,2 కాదు..ఏకంగా నలుగురు మెగా హీరోల మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కి ఊపు...

1,2 కాదు..ఏకంగా నలుగురు మెగా హీరోల మల్టీస్టారర్.. ఫ్యాన్స్ కి ఊపు తెప్పించే అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ల ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలో నటించడానికి ఇష్టపడుతున్నారు . దానికి కారణం ఈ మధ్యకాలంలో మల్టిస్టారర్ సినిమాలను ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనాలు. కాగ చిన్న హీరో సినిమాలో ఓ పెద్ద హీరో నటించడానికి కూడా ఇష్టపడుతూ ఉండటం గమనార్హం . ఇలాంటి క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి భారీ మల్టీ స్టారర్ రాబోతుంది అంటూ క్రేజీ హింట్ ఇచ్చేశాడు హీరో వరుణ్ తేజ్ .

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ నటిస్తున్న సినిమా “గాండీవ దారి అర్జున”. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి క్రమంలోనే హోస్ట్ “మీ ఫ్యామిలీ నుండి మల్టీ స్టారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా..? ఆల్రెడీ సాయి ధరంతేజ్ – పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించారు ..అలాంటిదే మరొక సినిమా ఏదైనా రాబోతుందా..?” అని అడిగారు.

వరుణ్ మాట్లాడుతూ..” కచ్చితంగా.. డైరెక్టర్స్ మేకర్స్ మంచి కథలను రాసుకొని వస్తే కచ్చితంగా కలిసి సినిమాలో నటించడానికి మాకు ఏ ప్రాబ్లం లేదు ..ఒకరు ఇద్దరు కాదు నలుగురు , ఐదుగురు అయినా సరే కలిసి నటించేందుకు మేము రెడీ అంటూ క్రేజీ హింట్ ఇచ్చేశాడు”. దీంతో సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి . మల్టీ స్టార్లర్ లో నటించడానికి మెగా హీరోలు రెడీ. మరి అలాంటి కథను ఏ డైరెక్టర్ సిద్ధం చేస్తారో చూడాలి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news