Movies' బ్రో ' సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ రెండో చెల్లి ఆ...

‘ బ్రో ‘ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ రెండో చెల్లి ఆ హీరోయిన్ కూతురా.. అబ్బా ఎంతం అందం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ జంటగా తెర‌కెక్కిన మల్టీస్టారర్ బ్రో. ఈ సినిమాలో సాయిధర‌మ్ తేజ్‌కు ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు. వీరిలో ఒకరు ప్రియా ప్రకాష్ వారియర్ కాగా.. రెండో చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది. ఆమె పేరు యువలక్ష్మి. అసలు పేరు యువ శ్రీలక్ష్మి. పుదుచ్చేరిలోని కరైకల్ ఆమె జన్మస్థలం.

యువలక్ష్మికి చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు జాతీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది. బీటెక్ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది .అమ్మ కనక్కు సినిమాతో ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ అమలాపాల్ కుమార్తెగా నటించింది.

ఆ తర్వాత సముద్రఖ‌ని దర్శకత్వం వహించిన అప్ప – శివ కార్తికేయన్ వెలైకార్ – అరుతురాతో పాటు కాంచన 3 సినిమాలలో సహాయక పాత్ర‌లలో నటించింది. అలాగే మాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఇక సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదయ సితం సినిమాలో నటించిన ఆమె అదే సినిమా తెలుగులో అదే సముద్రఖని డైరెక్షన్లో రీమేక్‌ చేస్తుండడంతో ఇక్కడ సాయిధర‌మ్ తేజ్ రెండో చెల్లెలుగా నటించి మెప్పించింది.

ఇక యువలక్ష్మి చిన్నప్పటి నుంచి జాకీచాన్ కు పెద్ద ఫ్యాన్ అట. జాకీచాన్ సినిమా ఎప్పుడు వచ్చినాన ఫస్ట్ షో అస్సలు మిస్ కానని చెబుతోంది. ఏదేమైనా యువ‌ల‌క్ష్మి అయితే మామూలు అందంతో లేదు. ఆమె అందానికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవ్వాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news