ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు వైరల్ అవుతుంది. .. దానికి కారణం..69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. ఐకాన్ స్టార్ అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప-ది రైజ్”లో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
తెలుగు చలనచిత్రం పరిశ్రమలోనే ఫస్ట్ టైం అల్లు అర్జున్ ఈ అవార్డు ని వరించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు శ్రేయోభిలాషులు ఆయనకు ఘనంగా పొగిడేస్తున్నారు. ఇలాంటి అవార్డులు మరెన్నో ఇంకా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నువ్వు తీసుకురావాలి బన్నీ అంటూ ప్రముఖులు సైతం ఆయనను విష్ చేస్తున్నారు .
కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరో మాత్రం అల్లు అర్జున్ కు విష్ చేయలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. అంతేకాదు అదే వ్యక్తి ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టడం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది . అయితే అతగాడికి అల్లు అర్జున్ కి ఉన్న విభేదాలు కారణంగానే ఆయన ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అంటూ ప్రచారం జరుగుతుంది,,!!