Newsసావిత్రికి ఉన్న ఆ పాడు అలవాటే బ్రతుకు నాశనం చేసిందా..?...

సావిత్రికి ఉన్న ఆ పాడు అలవాటే బ్రతుకు నాశనం చేసిందా..? ఆ మాట అనకుండా ఉండాల్సిందా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆమె నటన ఆమె అందం నేటి కాలం హీరోయిన్స్ కి అస్సలు లేదనే చెప్పాలి . అంతేకాదు ఆమె అంత మంచి మనసు కూడా నేటి కాలం హీరోయిన్స్ కి అస్సలు లేదు . కాగా సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానంలో ఉన్న హీరోయిన్ సావిత్రి లాస్ట్ రోజుల్లో ఎంత ధీనమైన స్థితిలో దిక్కులేని విధంగా మరణించిందో మనకు తెలిసిందే .

ఆకరి రోజుల్లో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకునే దానికి కూడా డబ్బులు లేక నానా తండాలు పడింది. అంతేకాదు ఆమె చనిపోయే టైంలో ఆమె కుటుంబానికి సంబంధించిన ఒక్కరు కూడా ఆమె పక్కన లేరు. అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానంలో ఉన్న సావిత్రి ఎందుకు లాస్ట్ రోజుల్లో ఇలా తన జీవితాన్ని ఇలా చేసుకున్నింది అంటే మాత్రం అందరికీ అందరూ చెప్పే పేరు జెమినీ గణేషన్ . ఆయనని పెళ్లి చేసుకోవడం వల్లే సావిత్రి ఇలాంటి పోసిషన్ కి చేరుకుంది అని.. అలాంటి దీనమైన స్థితిలో మరణించింది అని చెప్పుకొస్తూ ఉంటారు . అయితే కేవలం ఆ కారణమే కాదు సావిత్రి బతుకు అలా మారిపోవడానికి కారణం ఆమె మొండి పట్టుదల .

ఎవరైనా సరే నువ్వు చేయలేవు అని చెప్తే సావిత్రి అది చేసి చూపిస్తుందట . అది మంచి కాదు చెడు కాదు. అందుకే సావిత్రి కెరియర్ అలా మారిపోయిందట . హీరోయిన్గా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే సినిమాలను ప్రొడ్యూస్ చేయడం డైరెక్ట్ చేయడం అలవాటు చేసుకుంది. నిజానికి ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ సైడు సావిత్రికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు . కానీ ” ఓ ఆడది అదేం చేస్తుంది” అనే మాట విన్న కారణంగానే సావిత్రి సినిమాలను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసింది . ఆ తర్వాత ఆమె సంపాదించిన ఆస్తి మొత్తం ఒక్కొక్కటిగా కరిగిపోతూ వచ్చింది .

అంతేకాదు జెమినీ గణేషన్ కి ఉండే పట్టుదల అదే విధంగా సావిత్రి కి ఉండడంతో ఇద్దరు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకనె వాళ్ళ సంసార జీవితం అలా మారిపోయింది అంటూ కూడా అప్పట్లో వార్తలు అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. మొత్తానికి తన కోపమే తన శత్రువు అయినట్లు సావిత్రి మూర్ఖత్వమే ఆమెను అంతటి స్థానానికి దిగజార్చిపోయేలా చేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news