Movies" అది అంతా అబద్ధం నమ్మకండి"..ఫస్ట్ టైం ఆ వార్తల పైన...

” అది అంతా అబద్ధం నమ్మకండి”..ఫస్ట్ టైం ఆ వార్తల పైన సిరీయస్ అయిన నాగ చైతన్య..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సమంత తో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఐటెం లా మారిపోయిన నాగ చైతన్య. రీసెంట్ గానె తమిళ్ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన కస్టడీ సినిమా లో నటించారు . ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్యను మరింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.

ఇక ఆయన సినిమా ఇండస్ట్రీకి పనికిరాడని ..ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి.. బిజినెస్ చూసుకోవచ్చని.. సలహా ఇస్తున్నారు . అంతేకాదు నాగచైతన్య కూడా అలాగే చేయడానికి సిద్ధపడ్డాడు అంటూ పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య బాలీవుడ్ సినిమాల రీమిక్స్ పై కన్నేశాడు అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది . దానికి తగ్గట్టే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ బూల్ బూలియా 2 హిందీ సినిమా రీమిక్స్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై నాగచైతన్య టీం స్పందించింది. నాగచైతన్య ఎటువంటి రీమిక్ సినిమాలు చేయడం లేదు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతే కాదు నాగచైతన్య త్వరలోనే మరో సినిమా ద్వారా జనాల ముందుకు రాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో ఏదైతే నాగచైతన్య పై రూమర్ సర్క్యూలేట్ అవుతుందో.. అది ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news