Moviesమహేశ్ బాబు అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్..మీసం తిపండ్రా అబ్బాయిలు..!!

మహేశ్ బాబు అభిమానులకు కాలర్ ఎగరేసే న్యూస్..మీసం తిపండ్రా అబ్బాయిలు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అందరి కళ్ళు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి పైనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాజమౌళి ఏనాడైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్నాడో అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో క్రేజ్ దక్కించుకున్నాడు . ఈ క్రమంలోనే రాజమౌళి తదుపరి సినిమా ఎవరితో చేస్తారో ఆ హీరో బ్యాగ్రౌండ్ ఏంటా అంటూ ఆరా తీస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటూ అఫీషియల్ గా కన్ఫామ్ అయ్యింది . అయితే ఈ సినిమా రెండు పార్ట్ లు గా తెరకెక్కబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లోని కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారట . భారీ భారీ యాక్షన్ సీన్స్ కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారట రాజమౌళి .

ఈ క్రమంలోని ఈ సినిమా కోసం మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఇప్పటివరకు మహేష్ బాబు కెరియర్ లో ఈ రేంజ్ పారితోషకం అందుకోలేదు. ఇది ఓ మహేష్ బాబు కెరియర్ లోనే ఓ రికార్డ్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news