Moviesఫస్ట్ నైట్ కి భార్యకి మర్చిపోలేని కానుక ఇచ్చిన శర్వానంద్..మనోడు మంచి...

ఫస్ట్ నైట్ కి భార్యకి మర్చిపోలేని కానుక ఇచ్చిన శర్వానంద్..మనోడు మంచి రొమాంటిక్ ఫెలోనే..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు . తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్న శర్వానంద్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ఈ ఏడాది మొదట్లో గ్రాండ్గా నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ .. ఆ తర్వాత పెళ్లి ఊసే ఎత్తలేదు . ఓ ఫోటో – వీడియో ఏది షేర్ చేయలేదు . దీంతో వీళ్ళ పెళ్లి ఆగిపోయిందని ..క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి .

అయితే ఇలాంటి క్రమంలోనే శర్వానంద్ వాటికి చెక్ పెడుతూ పెళ్ళి డేట్ ప్రకటించారు . అంతేకాదు జూన్ మూడవ తేదీ రాజస్థాన్లోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా 11 గంటల మూడు నిమిషాలకు రక్షిత రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేశాడు శర్వానంద్. దీంతో ఆయన మ్యారీడ్ లైఫ్ ప్రారంభమైంది . అయితే అలా రక్షిత మెడలో మూడు ముళ్ళు వేశారో లేదో.. ఇలా మారిపోయాడు శర్వానంద్ అంటూ న్యూస్ వైరల్ అవుతున్నాయి.

దానికి కారణం ఆయన సినిమాలకు కొన్నాళ్లపాటు బ్రేక్ వేయాలనుకుంటున్నారట. రక్షిత రెడ్డిని ఫారిన్ కంట్రీస్ కి తీసుకెళ్లి సరదాగా కాసేపు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారట . అంతేకాదు రక్షిత రెడ్డికి శర్వానంద్ మొదటి రాత్రి కానుకగా ఓ డైమండ్ నెక్ సెట్ ను ప్రజెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అది ఆమె కోసం ఎంతో స్పెషల్ గా డిజైన్ చేయించి మరి ఆమె కి ఇష్టమైన డిజైన్ గా చేసి ఆర్డర్ చేయించి ఇచ్చాడట. దీంతో సోషల్ మీడియాలో రక్షిత రెడ్డి శర్వానంద్ ల పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news