Moviesనీ కంటే ఆ ముగ్గురు హీరోయిన్లే నాకు ఇష్టం... పూజా హెగ్డేకు...

నీ కంటే ఆ ముగ్గురు హీరోయిన్లే నాకు ఇష్టం… పూజా హెగ్డేకు తేల్చి చెప్పిన త్రివిక్ర‌మ్‌…?

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో సినిమాగా రూపొందుతున్న ‘గుంటూరు కారం’పై ఇప్పటికే చాలా హైప్‌ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మొదట షెడ్యూల్ విషయంలో ఇబ్బందులు ఎదురు కాగా ఇప్పుడు క్యాస్టింగ్ విషయంలో సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా అనుకున్న పూజా హెగ్డేని త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసేసాడట.

దాంతో సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ చేసుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా ప్రమోట్ అయిందని సినిమా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పూజాని తీసేసిన మాట నిజమో, అబద్ధమో తెలియ రాలేదు కానీ సినిమా బృందం మాత్రం ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీన్నిబట్టి ఆమెను తీసేసారని తెలుస్తోంది. అస‌లు త్రివిక్ర‌మ్‌కే పూజా అంటే ఇంట్ర‌స్ట్ లేద‌ని గాసిప్‌. మరి ఈ బుట్టబొమ్మ ప్లేస్‌లో ఎవరిని భర్తీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దీనిపై కూడా ఒక టాక్ నడుస్తోంది. అదేంటంటే, త్రివిక్రమ్ ఇద్దరు మలయాళ హీరోయిన్లలో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నాడట. మొదటగా సంయుక్త మీనన్‌ను, తర్వాత మాళవిక మోహనన్‌ను పరిశీలిస్తున్నాడట. సంయుక్త మీనన్‌ వరుస హిట్స్ తో ఈ మధ్యకాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. బ్యూటీ, యాక్టింగ్ ఈ రెండింటి పరంగా సంయుక్త మిగతా వారి కంటే కాస్త మెరుగ్గానే ఉంది. త్రివిక్రమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో సంయుక్త ఒక సినిమా కూడా చేసింది.

వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటూ ఆమెనే గుంటూరు కారం మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవాలని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి కూడా చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతుండగా, ఆమెను కూడా త్రివిక్రమ్ పరిగణలోకి తీసుకుంటున్నాడు. చివరికి ఎవరిని ఫిక్స్ చేస్తారో త్వరలోనే తెలుసే అవకాశం ఉంది. ఏదేమైనా త్రివిక్ర‌మ్ చాయిస్‌లో ఇప్పుడు పూజా కంటే పై ముగ్గురు హీరోయిన్లే ముందంజలో ఉన్నార‌ని తేల్చిచెప్పిన‌ట్లైంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news