Movies"ఆది పురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ మిస్టేక్.. స్టేజీ...

“ఆది పురుష్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ మిస్టేక్.. స్టేజీ పైనే ఏడ్చేసిన డైరెక్టర్ ఓం రౌత్..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో రీసెంట్ గా నటించిన సినిమా “ఆది పురుష్”. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా నటించారు . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు . ఈ క్రమంలోనే స్టేజిపై డైరెక్టర్ ఓం రావత్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు .

“ఈ సినిమా ఏ థియేటర్లో ఎక్కడ ఆడుతున్న సరే.. ఎన్ని షోస్ పడినా సరే.. ఆ థియేటర్స్ లో ఒక సీట్ ఆంజనేయస్వామికి వదిలేయాలని కోరారు. మనం ఆంజనేయ స్వామిని తలుచుకున్న ప్రతిసారి ఆంజనేయస్వామి అక్కడే ఉంటూ మనల్ని వీక్షిస్తూ ఉంటారని ..వాళ్ల అమ్మగారు చెప్పారని .. ఆ కారణంగానే ఇలా చేయాలి ” అంటూ స్టేజిపై ప్రొడ్యూసర్స్ ని రిక్వెస్ట్ చేశారు. దీంతో ప్రొడ్యూసర్స్ కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించారు .

అంతేకాదు ఇలా మాట్లాడుతూ ఓం రౌత్ ఎమోషనల్ అయిపోయారు . దీంతో ప్రభాస్ ఆయనని కంట్రోల్ చేస్తూ హగ్ చేసుకున్నారు. కాగా ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బిగ్ మిస్టేక్ జరిగింది . అభిమానుల కోసం ఎంతో స్పెషల్గా డిజైన్ చేసిన ట్రైలర్ ని ఎటువంటి హంగామా లేకుండానే బై మిస్టేక్ టెలికాస్ట్ చేసేసారు. దీంతో ఆదిపురుష్ టీం కి అది డిజాస్టర్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో టెక్నికల్ టీం ని ఏకిపారేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news