Moviesపబ్లిక్ గానే శ్రీవారి సన్నిధిలో ఆది పురుష్ డైరెక్టర్ పాడు పని.....

పబ్లిక్ గానే శ్రీవారి సన్నిధిలో ఆది పురుష్ డైరెక్టర్ పాడు పని.. బూతులు తిడుతున్న జనాలు..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్న సాయంత్రం తిరుపతిలో గ్రాండ్గా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . ఈ క్రమంలోని రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నింది ఆది పురుష్ టీం.

ఈవెంట్ ముందు రోజే సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్ అనంతరం స్వామి వారి దర్శనం ముగించుకొని స్వామివారికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అయితే ఇదే క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిన పక్క రోజు అనగా నేడు ఉదయం హీరోయిన్ కృతి సనన్..డైరెక్టర్ ఓం రావత్.. ప్రొడ్యూసర్ శ్రీవారిని దర్శించుకున్నారు . శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మండప వీధుల్లో హిరోయిన్ కృతి సనన్ తో బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దేవుడి దర్శనం అనంతరం బయటికి వచ్చిన కృతి సనన్ ని ఓం రావత్ గట్టిగా హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. అంతే కాదు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ గాడ్ బ్లెస్స్ యు అంటూ దీవించారు . ఈ క్రమంలోనే స్వామివారి సన్నిధిలో ఇలాంటి పనులు ఏంటయ్యా అంటూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు . అంతేకాదు మీ యవ్వారం తేడాగా ఉంది అంటూ మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news