Moviesపవిత్ర - రాజేంద్ర ప్రసాద్ కి మరదలా..? బయట పడ్డ షాకింగ్...

పవిత్ర – రాజేంద్ర ప్రసాద్ కి మరదలా..? బయట పడ్డ షాకింగ్ రిలేషన్ షిప్ .. వరసలు ఇలా కూడా మారుతాయా..?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో పవిత్ర – నరేష్ కి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. కాగా రీసెంట్ గానే ఈ జంట పెళ్లి చేసుకుని భార్యాభర్తలు గా మారిపోయారు అన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రతి ఈవెంట్లో నరేష్ – పవిత్ర ఎక్కడ కనిపించిన ఈలలు వేసి హంగామా చేస్తున్నారు .

రీసెంట్ గా సంతోష్ శోభన్ -మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా నటించిన “అన్ని మంచి శకునములే ” అనే సినిమా ఫంక్షన్లో నరేష్ మెరిసారు. నందినీ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఈ క్రమంలోని రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన లభించింది . టైటిల్ సాంగ్ లాంఛ్ ప్రోగ్రాం నిర్వహించారు . ఈ ఈవెంట్ లో రాజేంద్రప్రసాద్ – నరేష్ కూడా పాల్గొన్నారు . కాగా ఈ సందర్భంగా సినిమా గురించి తక్కువగా నరేష్ గురించి ఎక్కువగా మాట్లాడారు రాజేంద్రప్రసాద్ .

ఆయన మాట్లాడుతూ ..”ఫన్నీ ఫన్నీ సెటైర్స్ పేల్చారు . సరదాగా కామెంట్లు చేస్తూనే ఘాటుగా తగిలేలా మాట్లాడారు “అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే రాజేంద్రప్రసాద్ మాటలపై నరేష్ ఏ మాత్రం సీరియస్ కాకపోవడం గమనార్హం. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ..”మా నరేష్ నిత్య పెళ్లి కొడుకు.. ఆడు మామూలు కత్తి కాదు ఆ విషయం మీ అందరికీ కూడా బాగా తెలుసు.. వాడి కత్తిని మేము వాడలేం ” అంటూ సరదాగా ఆటపట్టిస్తూనే ఘాటుగా కౌంటర్ వేశారు .

అనంతరం నరేష్ నా తమ్ముడు అంటూ దగ్గరికి పిలుచుకుని చూశాడా .. పెళ్ళికొడుకులా ఉన్నాడుగా అంటే.. వెంటనే నరేష్ అవును నేను నిత్యం పెళ్ళికొడుకేగా అంటూ చమత్కరించారు . ఈ క్రమంలోనే వాళ్ళు చేసిన సరదా కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పలువురు నరేష్ తమ్ముడు అయితే పవిత్ర నీ మరదలా ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజేంద్రప్రసాద్ సరదాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సీరియస్ గా ట్రోల్ కి గురవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news