MoviesMega Family మెగా ఫ్యామిలీకి కీడు జరగబోతుందా..? అందుకే ఇలా జరిగిందా..?

Mega Family మెగా ఫ్యామిలీకి కీడు జరగబోతుందా..? అందుకే ఇలా జరిగిందా..?

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ లాస్ట్ గా తెరకెక్కించిన చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రాంచరణ్ కలిసి మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . అంతే కాదు పెట్టిన దానికి సగం కూడా వసూళ్లు రాబట్టలేక డిస్ట్రీబ్యూటర్లను రోడ్డున పడేసింది . ఈ క్రమంలోనే గతంలో ఆచార్య సినిమా విషయంలో పలు వివాదాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొరటాల శివ ఈ సినిమా కోసమే కోట్లు ఖర్చు చేసి మరి ధర్మస్థలి సెట్ వేశారు . అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యింది. అయితే సోమవారం రోజు మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఆచార్య సినిమా కోసం వేసిన సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది . ఆశ్చర్యం ఏంటంటే ఒక్క వస్తువు కూడా మిగలలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేసిన సెట్ మొత్తం బూడిద పాలైంది. ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అంటూ జనాలు ఆరాధిస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి . అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని ఆరా తీస్తున్నారు జనాలు. అగ్ని ప్రమాదం జరిగే కొద్ది గంటల ముందు.. అక్కడ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారని ..వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారని.. వాళ్ళు వెళ్లిన కొద్ది గంటలకే ఇలా సెట్ మొత్తం తగలబడిపోయిందని ..ఇది కావాలనే చేశారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా ..? అని జనాలు చర్చించుకుంటున్నారు .

అయితే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటి టైం లోనే అగ్నిప్రమాదం జరగడం అభిమానులకు కీడుగా భావిస్తున్నారు. మెగా కోడలు ఉపాసన జాతకాన్ని పండితులకు చూపించి.. శాంతి పరిహార పూజలు చేయాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆచార్య ధర్మస్థలి సెట్ కాలిపోయిన వివాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news