Movies"ఆ రోల్ ప్రభాస్ చేయాల్సింది.. లాస్ట్ మినిట్ లో ఆయన చేశాడు".....

“ఆ రోల్ ప్రభాస్ చేయాల్సింది.. లాస్ట్ మినిట్ లో ఆయన చేశాడు”.. ఇంట్రెస్టింగ్ విషయాని రివీల్ చేసిన గోపీచంద్..!!

టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రజెంట్ ఎలాంటి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. రీసెంట్గా తెరకెక్కించిన సినిమా వీరసింహారెడ్డి . నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్గా.. మరో హీరోయిన్గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో జోరుగా పాల్గొంటున్న గోపీచంద్ మలినేని.. రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యులో ఆయన మాట్లాడుతూ..”ప్రభాస్ తో చేయాల్సిన సినిమా మిస్సయింది అంటూ ఓపెన్ అప్పయ్యాడు”. గోపీచంద్ మాట్లాడుతూ..”నిజానికి నేను కధ రాసుకునే ముందే ఓ హీరో ఈ కథకు బాగుంటాడని అనుకుంటాను . అయితే కొన్నిసార్లు ఆ హీరో చేస్తూ ఉంటారు ..కొన్ని సార్లు మిస్ అవుతుంటారు. అయితే నా మైండ్ లో మాత్రం ఆ కథ వింటే ఫస్ట్ ఆ హీరోనే గుర్తొస్తాడు”.

“డాన్ శ్రీను సినిమా విషయంలో చాలా గడబిడి జరిగింది . నేను ప్రభాస్ కోసమే ఈ సినిమా ఎంతో ఇష్టంగా అనుకున్నాను. ప్రభాస్ సైతం స్టోరీ బాగా వచ్చింది . ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఈ సినిమా స్టోరీ బాగా సెట్ అవుతుంది అనుకున్నాను. అయితే అప్పటికే ప్రభాస్ ఫుల్ కాల్ షీట్స్ తో బిజీగా అయిపోయాడు అ. యితే ఆ తర్వాత ఆ కథను గోపీచంద్ కూడా వివరించాం . కానీ గోపీచంద్ కూడా అప్పటికే మూవీస్ తో బిజీగా ఉన్నాడు . ఈ క్రమంలోనే ఆ స్టోరీ రవితేజకు చెప్పి ఒప్పించడం ..కేవలం 77 రోజుల్లోనే ఆ సినిమా షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడం జరిగిపోయింది “అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమా అప్పట్లో అవరుస ఫ్లాప్ లో ఉన్న రవితేజకు మంచి బూస్టప్ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ గోపీచంద్ మల్లినేని కాంబోలో బలుపు, క్రాక్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు పడ్డాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news