Moviesరోజా - సెల్వ‌మ‌ణి 11 ఏళ్ల పాటు ఎందుకు ప్రేమించుకున్నారు.. రోజ...

రోజా – సెల్వ‌మ‌ణి 11 ఏళ్ల పాటు ఎందుకు ప్రేమించుకున్నారు.. రోజ ఇంత క‌థ న‌డిపించిందా…!

నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ప్రేమ త‌పస్సు` అనే మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన రోజా.. `సీతారత్నంగారి అబ్బాయి`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. తమిళంలో కూడా రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో నటించిన రోజా.. ప్ర‌స్తుతం రాజ‌కీయ నాయకురాలిగా ఏపీ పాలిటిక్స్ లో స‌త్తా చాటుతోంది.

ఇక రోజా వ్య‌క్తిగ‌త విష‌యానికి వ‌స్తే.. ఈమె ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే వీరి పెళ్లి అంత సుల‌భంగా ఏమీ జ‌ర‌గ‌లేదు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `చెంబురతి` మూవీతో రోజా కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ మూవీని సెల్వమణినే తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా స‌మ‌యంలోనే సెల్వమణి, రోజా మ‌ధ్య స్నేహం ఏర్ప‌డ‌గా.. ఆ స్నేహం ప్రేమ‌కు దారి తీసింది.

కానీ, సెల్వమణి తాను ప్రేమిస్తున్న విష‌యాన్ని మొద‌ట రోజాకు కాకుండా.. ఆమె త‌ల్లిదండ్రుల‌కు చెప్పాడ‌ట‌. రోజాను వివాహం చేసుకునేందుకు వారి అనుమ‌తి కూడా తీసుకున్నాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న రోజా.. మొద‌ట షాక్ అయినా ఆ త‌ర్వాత సెల్వమణితో పెళ్లికి ఒకే చెప్పింది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. రోజా ఓకే చెప్పాక‌ సెల్వమణిని ఆమె పెళ్లి చేసుకోవ‌డానికి 11 ఏళ్లు ప‌ట్టింద‌ట‌.

ఇంత ఆలస్యానికి కారణమేంటి లేక‌పోలేదు.. తాను హీరోయిన్ అవ్వడం కోసం రోజా అన్నదమ్ములు వారి కెరీర్‌ల‌ను వదిలిపెట్టి ఈమెతో ఉండిపోయారట. అందుకే ఒక సినిమా తీసి దాని ద్వారా వచ్చే డబ్బుతో త‌న అన్న‌ద‌మ్ముల‌ను సెటిల్ అయ్యేలా చేయాల‌ని భావించింద‌ట రోజా. అందులో భాగంగానే `సమరం` అనే చిత్రాన్ని తెలుగు మ‌రియు తమిళ భాషల్లో తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ట‌. రోజా అనేక సార్లు షూటింగ్ లో గాయ‌ప‌డింది.

ఇక ఎలాగోలా ఈ సినిమా విడుద‌లైంది. కానీ, బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. దాంతో రోజుకు భారీ న‌ష్టాలు వ‌చ్చాయ‌ట‌. ఆ న‌ష్టాల వ‌ల్ల ఆమె ఎన్నో క‌ష్టాలు ప‌డింద‌ట‌. ఇక అలా ఈ చిత్రం ద్వారా ఏర్పడిన ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు రోజా మరికొంత కాలం చిత్రాలు చేయాల్సి వచ్చింది. ఇలా అనేక అనుకోని సంఘటనలు వీరి వివాహాన్ని వాయిదాల పైన వాయిదాలు పడేలా చేశాయి. చివ‌రాఖ‌ర‌కు రోజా, సెల్వమణిలు 2002లో పెళ్లి చేసుకోగా.. ఈ దంప‌తుల‌కు కూతురు అన్షు మాలిక, కొడుకు కృష్ణ లోహిత్ జ‌న్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news