Moviesఅది వాళ్ల పర్సనల్..దాంతో ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దు..మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!

అది వాళ్ల పర్సనల్..దాంతో ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దు..మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు..!!

మంచు విష్ణు.. మొహన్ బాబు పెద్ద కొడుకుగా..సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వచ్చిన సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఓ స్దానం లేకపోయిన .. హీరోగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఎవ్వరు ఊహించని విధంగా Movie ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసి.. నానా రచ్చ గంగామా చేసి ఫైనల్ గా మా పీఠాని దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఏం చేయలేదు.. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు వేస్ట్ అంటూ కొందరు నటులు కామెంట్స్ కూడా చేసారు.

కానీ విష్ణు అవి ఏం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా విష్ణు.. రీసెంట్ గా ఏపీలో జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గిస్తూ జారీ చేసిన జీవో పై పెద్ద రచ్చలు జరుగుతుంటే..ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవి జగన్ ను కలిసి..ఇండస్ట్రీలోని సమస్యలను..ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్న వాళ్ళ పొట్ట కొట్టకండి అంటూ మాట్లాడి బుజ్జగించి..భోజనం చేసి వచ్చారు. ఇక ఆ తరువాత ఈ సమస్య పై పెద్దగా ఏ హీరో జోక్యం చేసుకోలేదు.

అయితే అనూహ్యంగా మంచి విష్ణు ఈ ఇష్యూ పై రియాక్ట్ అవుతూ..సంచలన కామెంట్స్ చేసారు. సీఎం జగన్‌తో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు దానికీ, ఇండస్ట్రీకి ముడిపెట్టొదన్నారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో దాసరి నారాయణరావుగారు పరిశ్రమ అభివృద్థికి కృషి చేసి ఓ జీవో తెచ్చారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు.

దీనిపై చర్చ జరగాలి. గతంలో వచ్చిన జీవోలు తీసేసిన జీవోలపై ముందు మాట్లాడాలని.. ఆతర్వాతే ప్రస్తుత జీవోలపై మాట్లాడాలన్నారు మంచు విష్ణు. ఒకరిద్దరు వేరువేరుగా సీఎం జగన్ ను కలిసి.. దానిపై తప్పుడు ప్రచారం చేయడం ఎంతమాత్రం సరికాదు అని..అందరం కలి ఒక్క మాట పై ఉండి వెళ్లి కలిస్తే బాగుంటుందని అన్నారు విష్ణు. మరి చూడాలి ఈ మటలకు చిరు ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news