Moviesఇటు ప్రియురాలు.. అటు చెల్లెలు.. మ‌హేష్ సినిమాలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు...!

ఇటు ప్రియురాలు.. అటు చెల్లెలు.. మ‌హేష్ సినిమాలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వ‌స్తోన్న క్రేజీ సినిమాలో రెండు కీల‌క పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ గ‌త కొన్నేళ్లుగా తీస్తోన్న సినిమాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పేరున్న న‌టుల‌ను తీసుకుంటున్నారు. అ..ఆ సినిమాలో స‌మంత‌ను, అల సినిమాలో పూజా హెగ్డేను, అత్తారింటికి దారేదిలో స‌మంత‌, ప్ర‌ణీత‌ను, అజ్ఞాత‌వాసిలో కీర్తిసురేష్ లాంటి వాళ్ల‌ను హీరోయిన్లుగా తీసుకున్నాడు.

అలాగే త‌న సినిమాల్లోనే ఉపేంద్ర‌, స్నేహ‌, న‌దియా, ఖుష్భూ, ట‌బూ లాంటి సీనియ‌ర్ న‌ట‌ల‌ను తీసుకుని వారి పాత్ర‌ల‌ను సెట్ చేసిన విధానం సూప‌ర్బ్‌. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌హేష్‌బాబుతో తెర‌కెక్కించే సినిమాలో మ‌హేష్ ప‌క్క‌న హీరోయిన్ పాత్ర‌కు పూజా హెగ్డేను తీసుకున్న‌ట్టు టాక్ ? పూజ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఇప్ప‌టికే అర‌వింద స‌మేత‌, అల సినిమాలు వ‌చ్చాయి. ఇక మ‌హేష్ – పూజ క‌లిసి మ‌హ‌ర్షి సినిమా చేశారు. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్లే రిపీట్ అవుతున్నాయి.

ఇక సిస్ట‌ర్ పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. ఈ పాత్ర‌కు సాయిప‌ల్ల‌విని తీసుకున్నార‌ట‌. సినిమాలో మెయిన్ పాయింట్ కూడా ఈ సిస్ట‌ర్ పాత్రతోనే ముడిప‌డి ఉంటుంద‌ట‌. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని మేక‌ర్స్ అనుకుంటున్నారు. ముందుగా మ‌హేష్ మీద ఓ సోలో సాంగ్‌తో పాటు ఫైట్ షూట్ చేస్తార‌ని టాక్ ? ఇక 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ( 2010లో ఖ‌లేజా సినిమా త‌ర్వాత ) మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

హారిక హాసిని క్రియేషన్స్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ – అల వైకుంఠ‌పురంలో సినిమాలు హిట్ అయ్యాక త్రివిక్ర‌మ్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news