Moviesబాక్సాఫీస్ బ‌రిలో బాబాయ్ వ‌ర్సెస్ అబ్బాయ్‌... గెలిచింది ఎవ‌రంటే...!

బాక్సాఫీస్ బ‌రిలో బాబాయ్ వ‌ర్సెస్ అబ్బాయ్‌… గెలిచింది ఎవ‌రంటే…!

టాలీవుడ్ లో నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి హీరోల్లో యువరత్న నందమూరి బాలకృష్ణ – టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ముందు రోజు నుంచే నందమూరి అభిమానులు పెద్ద పండగ చేసుకుంటారు. సినిమా రిలీజ్ కు ముందు రోజు ఎక్కడికక్కడ భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు కడుతూ ఆ రాత్రంతా మేలుకొని ప్రీమియర్ షో చూసిన తర్వాత ఇళ్లకు వెళ్తారు. అలాంటిది సంక్రాంతికి ఇద్దరు నందమూరి హీరోల అభిమానులు నటించిన సినిమాలు థియేటర్లలో ఉంటే ఇక మామూలు పండగ కాదు.

అలాంటి అరుదైన సందర్భం 2004 లో జరిగింది. 2004 సంక్రాంతికి బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం – మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి రెండు వారాల ముందు జనవరి ఒకటవ తేదీన ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటించిన సినిమా ఆంధ్రావాలా… అటు ఠాగూర్ లాంటి హిట్ తర్వాత చిరంజీవి అంజి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ నాలుగు సినిమాలలో లక్ష్మీ నరసింహ – వర్షం సూపర్ హిట్ అయ్యాయి. అంజి, ఆంధ్రావాలా రెండు డిజాస్టర్ లు అయ్యాయి. 2004 సంక్రాంతికి ఆంధ్రావాలా – లక్ష్మీనరసింహ సినిమాలను రిలీజ్ చేయాలని అనుకున్నారు. సంక్రాంతి బరిలోనే అంజి – వర్షం సినిమాలు కూడా ఉండడంతో ఆంధ్రావాలాను కాస్త ముందుగా జనవరి 1వ తేదీన రిలీజ్ చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రక్షిత హీరోయిన్ గా నటించింది.

ఆంధ్రావాలా సినిమా ఫస్టాఫ్ బాగున్నా… సెకండాఫ్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో తిరస్కరించారు. ఇక కోలీవుడ్ లో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి సినిమాకు రీమేక్ గా తెలుగులో లక్ష్మీ నరసింహ వచ్చింది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు జయంత్ దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన ఆశిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా 277 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుని సంచలన విజయం సాధించింది. అలా అప్పుడు బాబాయ్ – అబ్బాయి మధ్య జరిగిన ఆసక్తికర పోరులో బాబాయ్ పైచేయి సాధించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news