Movies2022లో బాల‌య్య ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా... ఫ్యీజులు ఎగిరే న్యూస్‌...!

2022లో బాల‌య్య ఫ్యాన్స్‌కు ఢ‌బుల్ ధ‌మాకా… ఫ్యీజులు ఎగిరే న్యూస్‌…!

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 25 రోజులు పూర్తి చేసుకుంది. బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి… ఇప్పటికే రు. 125 కోట్ల రూపాయలు వ‌సూలు చేసిన‌ట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. బాలయ్య కెరీర్లోనే రు. 100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలోనే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో మరోసారి అఖండ ప్రూవ్ చేసింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్‌ సినిమాలు బ్లాక్‌బ‌స్టర్ హిట్లు అయ్యాయి. ఇప్పుడు అఖండ ఈ రెండు సినిమాలను నుంచి సూపర్ డూపర్ హిట్ అయింది.

చాలా రోజుల తర్వాత బాలయ్య అభిమానుల్లో అఖండ సినిమా ఫుల్ జోష్ నింపింది అని చెప్పాలి. మంచి కమర్షియల్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్న బాలయ్య మరోవైపు బుల్లి తెరమీద కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుసపెట్టి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య తన తర్వాత సినిమాలో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మలినేని గోపీచంద్ ఈ ఏడాది మాస్ మహారాజా రవితేజతో క్రాక్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు బాలయ్య కోసం అదిరిపోయే పవర్ఫుల్ కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా బాలయ్య సినిమా కోసం రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. ఇక బాలయ్య అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఏంటంటే 2022 వ సంవత్సరంలోనే రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

మలినేని గోపీచంద్ సినిమా ఏప్రిల్ లేదా మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక 2022 దసరాకు అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్ల‌తో బాలయ్య సినిమాలు రిలీజ్ అయితే బాలయ్య ఫ్యాన్స్‌ అంతకు మించిన ఆనందం ఏముంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news