Newsటీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: భారత్‌-పాకిస్థాన్‌ పోరు..రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు..ఎన్ని కోట్లో తెలుసా..?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌: భారత్‌-పాకిస్థాన్‌ పోరు..రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు..ఎన్ని కోట్లో తెలుసా..?

టీ-20 వరల్డ్ కప్‌లో దాయాదుల పోరుకు రంగం సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులకే కాదు యావత్ క్రీడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్‌. దాయాదిపై స‌మ‌రం ఓ సూప‌ర్ ఎన్‌కౌంట‌ర్‌లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్ష‌కులు టీవీల‌కే హ‌త్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఆ మ‌జాయే వేరు.

టీ20 ప్రపంచకప్‌లో అత్యంత రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం నాడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ టోర్నీల్లో ఒక్కసారి కూడా పాక్‌ చేతిలో భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పాక్ జట్టు కసిగా ఉంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ దమాకా. బెట్టింగ్‌ రాయుళ్లకు కోట్లు కురిపించే మ్యాచ్‌. ఈ సూపర్ సండే రోజున భారత్‌-పాకిస్తాన్ నువ్వా నేనా అన్నట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం బెట్టింగ్‌ రాయుళ్లు కాచుకుని కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ భారీ ఎత్తున బెట్టింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు హైదరాబాద్‌లో ఈ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పాకిస్తాన్‌పై వెయ్యికి రూ.1,600… భారత్ గెలిస్తే వెయ్యికి రూ.2 వేలు ఇస్తామంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆశ చూపుతున్నారు. టాస్ నుంచి మొదలుకొని ఏ బ్యాట్స్‌మెన్ ఎంత కొడతాడనే దానిపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైద‌రాబాద్‌లోని రెస్టారెంట్లు, బార్లు, హోట‌ళ్లలో పెద్ద తెరలపై క్రికెట్ ప్ర‌సారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లలో ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news