Moviesక్రేజీ కాంబో: RRR మేకర్స్ తో తండ్రి కొడుకుల సినిమా ఫిక్స్..డైరెక్టర్...

క్రేజీ కాంబో: RRR మేకర్స్ తో తండ్రి కొడుకుల సినిమా ఫిక్స్..డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ సినిమా అంటే ఇది అన్న రేంజ్ లో తెలుగు సినిమా సత్తా ఏంటనేది ‘బాహుబలి’ రెండు పార్టులతో ప్రపంచానికి చాటిచెప్పారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇక తర్వాత అదే రేంజ్ హైప్ క్రియేట్ చేసి ఒక్కే ఒక్క సినిమా..పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవి ‘కె.జి.యఫ్’. అప్పటివరకు ప్రేక్షకులు ఇంతకుముందెన్నడూ వెండితెరపై చూడని కోలార్ మైనింగ్స్ బ్యాక్‌డ్రాప్ కథను ఎమోషనల్‌గా ప్రజెంట్ చేసి.. యావత్ చిత్ర పరిశ్రమ చూపు తన వైపు తిప్పుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.

ఓ డ‌బ్బింగ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. య‌ష్ అనే హీరోతో కేజీఎఫ్ చిత్రాన్ని తెర‌కెక్కించి సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు ప్ర‌శాంత్ నీల్. ఇప్పుడు ఆయ‌న తెర‌కెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్.. స‌లార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నాడు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి..ఆయన కొడుకు రాం చరణ్ తో ఓ సినిమా చేయ్యబోతున్నాడంటూ..టాలీవుడ్ లో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా ప్ర‌శాంత్ నీల్ రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో దిగ్గిన ఫోటోలు నెట్టింట ప్రత్యేఖమైయాయి. చ‌ర‌ణ్‌.. ప్ర‌శాంత్ నీల్‌ని త‌న ఇంటికి ఆహ్వానించ‌గా ఆ స‌మ‌యంలో చిరంజీవితో క‌లిసి ప్రశాంత్ నీల్‌, చ‌ర‌ణ్ ఫొటో దిగారు. ఈ పిక్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరుని క‌ల‌వ‌డంతో చిన్న‌నాటి క‌ల నెర‌వేరిన‌ట్టుగా తెలియ‌జేశాడు. కాగా, చరణ్ ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. మరో మూవీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఎప్పటినుండో వారత్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చరణ్, ప్రశాంత్ నీల్‌ ,మెగాస్టార్ చిరంజీవి ఈ ముగ్గురు కలిసి ఉన్న ఫోటో లు చూసీ ఆయన డైరెక్షన్ లో RRR మేకర్స్ తో రాం చరణ్-చిరంజీవి రాబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news