Moviesఆహా లో టాక్ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో...

ఆహా లో టాక్ షో కోసం బాలయ్య ఎంత పారితోషకం తీసుకుంటున్నాడో తెలుసా..?

తన కెరీర్ లోనే ఇది వరుకు ఎప్పుడు చేయని యాంకరింగ్ వైపు అడుగులు వేసారు నందమూరి బాలకృష్ణ. నందమూరి హీరో కొత్త అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఆహా వాళ్లతో కలిసి బాలకృష్ణ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం హోస్ట్ గా చేయబోతున్నారు. బాలయ్య యాంకరింగ్ చేస్తున్నారు అంటే అందరికి ఆశ్చర్యంగానే ఉంది. ఆహ ఓటిటిలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో చేయబోతున్నారు. ‘అన్‌స్టాప‌బుల్‌’ పేరుతో ఈ షో రాబోతుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ కూడా జరిగింది.

ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే ఆలోచించే నందమూరి బాలకృష్ణ.. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య యాంకరింగ్ చూడటానికి అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ షోని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. నవంబర్ 4 నుంచి ఆహాలో ఈ షో టెలికాస్ట్ అవ్వనుందని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ అన్‌స్టాప‌బుల్‌ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే అందుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమా కంటే ఎక్కువగా దీనికే పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. బాలయ్య బాబుకి ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 40 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్టు సమాచారం. మొదటి సీజన్ 12 ఎపిసోడ్స్‌తో ప్లాన్ చేయబోతున్నారు. అంటే ఈ సీజన్ మొత్తానికి కలిపి దాదాపు 5 కోట్ల వరకు అందుకుంటున్నాడు బాలయ్య. అల్లు అరవింద్ ఖర్చుకి వెనకాడకుండా ఆహ ఓటిటిని తెలుగులో మిగిలిన అన్ని ఓటిటిలకి ధీటుగా నిలబెడుతున్నారు.

ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట.ఖర్చు ఎలా ఉన్నా అభిమానులు, ప్రేక్షకులు ఈ షో కోసం వెయిట్ చేయడం చూస్తుంటే ఈ షో బాగా హిట్ అయి ఆహాకి మరింత ప్లస్ అవుతుందని అనిపిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news