Moviesక్రేజీ కాంబినేషన్ రిపీట్: ఒకే స్క్రీన్ పై సమంత-ఎన్టీఆర్..?

క్రేజీ కాంబినేషన్ రిపీట్: ఒకే స్క్రీన్ పై సమంత-ఎన్టీఆర్..?

సమంత గత కొన్ని వారాలు గా డైవర్స్ విషయంలో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రీజన్ ఏంటో తెలియదు కానీ ఎంతో హ్యాపీగా చూడ ముచ్చటైన జంట..టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్ అనిపించుకున్న ఈ జంట విడాకులు వైపు అడుగులేస్తున్నారు. మేం విడిపోతున్నాం..కానీ మేం మ్మచి ఫ్రేండ్స్ గా ఉంటాం అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.

ఇక అప్పటి నుండి ఈ జంట పేర్లు మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం..సమంత ఆ డైవర్స్ విషయం నుండి బయటపడడానికి వరుస సినిమాలకు సైన్ చేస్తూ.. బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుందట. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ తారక్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి గెస్ట్ గా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఇప్పటికే ఈ షోలో సామాన్యుల‌తోపాటు సెల‌బ్రిటీలు కూడా పాల్గొంటూ అంద‌రినీ హుషారెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్లు రాజ‌మౌళి-కొర‌టాల శివ ఈ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు. మ‌హేశ్ బాబు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌ల చేశారు. త్వరలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ షోకి రానునాడని తెలుస్తుంది. అయితే తాజాగా లీక్ అవుతున్న మ్యాటర్ బట్టి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా ఈ షోకి గెస్ట్ గా రాబోతున్నారట. మరి చూడాలి ఈ షో లో ఏమైన తన విడాకులు ఎందుకు తీసుకున్నారో అనే విషయం గురించి క్లారిటీ ఇస్తుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news