Moviesఆ స్విమ్మింగ్ పూల్ వల్లే సావిత్రి కెరీర్ నాశనం అయిపోయిందట..ఎలా అంటే..??

ఆ స్విమ్మింగ్ పూల్ వల్లే సావిత్రి కెరీర్ నాశనం అయిపోయిందట..ఎలా అంటే..??

మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమె అసలు పేరు నిస్సంకర సావిత్రి. మహానటి సావిత్రి .. తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక హీరోయిన్ అని చెప్పవచ్చు. ఈమె సినిమా వస్తుందంటే చాలు కచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతలా నటించి ప్రతి సినిమాకు ఈమె హైలెట్ కావడం విశేషం. మొదటిసారి 1950లో వచ్చిన సంసారం సినిమాలో కథానాయిక పాత్ర పోషించింది సావిత్రి. తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ పాతాళ భైరవి సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి ఘన విజయం అందుకుంది.

అంతేకాదు..పెళ్లి చేసి చూడు, దేవదాసు, మిస్సమ్మ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఎక్కువగా అగ్ర నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల సరసన నటించి తన కంటూ ఒక మంచి ప్రత్యేకతను సంపాదించుకుంది. అంతేకాదు ఈమె బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. 1957లో మాయాబజార్ లో తన నటనకు ఆమె స్టార్ డం మరింత పెరిగిపోయింది. అంతేకాదు ఆ తరం లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక ఈమె ఉదార మనసుకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఇక ఈమె తెలుగులోనే కాకుండా తమిళం,కన్నడ ఇతర భాషలలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. తను హీరోయిన్ గా సంపాదించిన డబ్బును కొంతమేరకు కార్మికులకు సహాయం చేస్తూ ఉండేది. ఇలాంటి మంచి మనసున్న ఉన్న హీరోయిన్.. చివరి రోజుల్లో అత్యంత దారుణంగా మరణించడం జరిగింది. ఈమె చివరి రోజుల్లో ఇలా అవ్వడానికి ముఖ్య కారణం తన ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తుని పాటించకపోవడం అనే మాటలు ఆప్పుడు ఎక్కువగా వినిపించాయి. ఈమె అప్పట్లో తన ఇంట్లో నిర్మించుకున్న స్విమ్మింగ్ పూల్ వల్ల ఆ ఇంటికి వాస్తు పూర్తిగా తప్పిపోవడంతో.. ఈమె అలా అవ్వడానికి కారణం అని సావిత్రి తల్లి జమున చెప్పినట్లు సావిత్రి కూతురు స్రవంతి రావు ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news