Moviesవాళ్లను క్షమించమని అడిగిన తమన్నా..ఎందుకో తెలుసా..??

వాళ్లను క్షమించమని అడిగిన తమన్నా..ఎందుకో తెలుసా..??

టాలీవుడ్ లో హాట్ బ్యూటీ మిట్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. బాహుబలిలో నటించిన ఆమె ఇలా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ రిపీట్ చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు.

అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశం వదలను అంటుంది తమన్నా. రీసెంట్ గా అమె నటించిన సీటిమార్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాచో హీరో గోపిచంద్, తమన్నా జంటగా.. సంపత్ నంది డైరెక్ట్ చేసిన స్పోర్ట్స్ బ్యాక్‌‌డ్రాప్ మూవీ ‘సీటీమార్’ వినాయక చవితి నాడు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు భారీ కలెక్షన్లతో పాటు గోపిచంద్‌కి మంచి కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో తమన్న నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి.

అయితే రిసెంట్ గా జరిగిన సీటీమార్ సక్సెస్ మీట్ లో తమన్నా ఆ సినిమా నిర్మాతలకు సారీ చెప్పింది. అందరి ముందు మీడియా ముఖంగా క్షమించమని అడిగింది. ఎందుకంటే.. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరో గోపిచంద్, దర్శకుడు ప్రమోషన్స్‌లో పాల్గొన్నారని..నేను మాత్రం ప్రచార కార్యక్రమాల్లో పాల్గోనలేదని ..ఇతర షూటింగ్స్, వ్యక్తిగత కారణాల వల్ల ‘సీటీమార్’ ప్రమోషన్స్‌లో పార్టిసిపెట్ చెయ్యడం కుదర్లేదని తమన్నా సారీ చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news