Gossipsఎట్టకేలకు బంపర్ ఆఫర్ పట్టిన మిల్కీబ్యూటీ త‌మ‌న్నా..?

ఎట్టకేలకు బంపర్ ఆఫర్ పట్టిన మిల్కీబ్యూటీ త‌మ‌న్నా..?

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలకు సైన్ చేసుకుంటూ యంగ్ హీరోలకు తీసిపోకుండా టాలీవుడ్ లో తన స్టామినా చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తోపాటుగా తమిళ ‘వేదాళం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన చిత్రం ‘వేదాళం’. ఈ మూవీ తమిళంలో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసేందుకు ఎప్పటిచంచో ప్రయత్నాలు జరుగుతున్న్..లాస్ట్ కి చిరంజీవి ఈ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై మెహర్ రమేష్ గత మూడేళ్లుగా పనిచేసారట. సినిమాలో చిరు స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో చాలా మార్పులే చేసారట.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కీ పోర్షన్స్ కు బ్యాక్ డ్రాప్ గా కోలకతా ని తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో చిరంజీవి ..గుండుతో కనపడతారు. గతంలో చిరంజీవి నటించగా పెద్ద హిట్టైన చూడాలని ఉంది సినిమా సైతం కోలకతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ సినిమా ఘన విజయం సాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకు సైతం అదే బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో చెల్లెలు పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ పాత్ర కోసం మేకర్స్ మహానటి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి పక్కన హీరోయిన్ కోసం కొన్ని నెలలుగా..ఎవరిని పెడతాం..ఎవరిని పెడితే బాగుంటుంది..అని ఆలోచించి చించి..మేకర్స్ ఫైన గా తమన్నా ని సెలక్ట్ చేసారట. నిజానికి చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా న‌టించినా..ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ చిత్రంలో తమన్నా ది చిన్న పాత్రే అయినా, సినిమాకు చాలా కీల‌క‌మైన రోల్‌. ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్‌తో త‌మ‌న్నా న‌టించ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు టాక్‌. ‘భోళా శంక‌ర్‌’ను చిత్రాన్ని త‌న‌దైన స్టైల్లో రిచ్‌గా క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో తెర‌కెక్కించ‌డానికి మెహ‌ర్ ర‌మేశ్ సిద్ధంగా ఉన్నాడట.
‘గాడ్ ఫాదర్’ తర్వాత ‘భోళాశంక‌ర్’ సినిమాతో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌డానికి చిరంజీవి రెడీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news