Moviesవిక్ట‌రీ వెంక‌టేష్‌తో సినిమా తీసి రు. 14 కోట్లు పోగొట్టుకున్న టాప్...

విక్ట‌రీ వెంక‌టేష్‌తో సినిమా తీసి రు. 14 కోట్లు పోగొట్టుకున్న టాప్ ప్రొడ్యుస‌ర్‌

మ‌న జీవితంలో చాలా అనుభ‌వాలు ఉంటాయి.. వాటిల్లో కొన్ని మంచివి.. కొన్ని చేదువి.. కొన్ని ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేవి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎంఎస్‌. రాజు ఓ అగ్ర నిర్మాత‌గా ఇర‌వై ఏళ్ల క్రితం ఎన్నో మంచి సినిమాలు తీశారు. ఆయ‌న నిర్మాణంలో వ‌చ్చిన మ‌న‌సంతా నువ్వే సినిమా 19 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న ఆ సినిమా అనుభ‌వాలు తాజాగా సోష‌ల్ మీడియాతో పంచుకున్నారు. అయితే ఆ సినిమాకు ముందుగా రాజు విక్ట‌రీ వెంక‌టేష్‌తో దేవీపుత్రుడు సినిమా తీశారు.

 

కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా రు. 14 కోట్ల న‌ష్టం మిగిల్చింది. ఆ దెబ్బ‌కు కోలుకోలేని రాజు ఆ త‌ర్వాత రు 1.30 కోట్ల బ‌డ్జెట్‌తో మ‌న‌సంతా నువ్వే సినిమా తీసి సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఆ రోజుల్లో ఆ సినిమా రు. 16 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. దేవిపుత్రుడు దెబ్బ‌తో పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయిన రాజుకు మ‌న‌సంతా నువ్వే నిజంగా ఊపిరి లూదింది. ఆ సినిమాతో పుంజుకున్నాక త‌ర్వాత రాజు మ‌ళ్లీ మ‌హేష్‌బాబు – గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్లో వ‌చ్చిన ఒక్కుడ సినిమా నిర్మించారు.

 

 

ఈ సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి రాజు ద‌శ‌ను పూర్తిగా మార్చేసింది. ఆ త‌ర్వాత ప్ర‌భాస్‌తో తీసిన వ‌ర్షంతో ఇక రాజు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా నిల‌దొక్కుకున్నారు. అయితే ఆయ‌న సినిమాల‌న్నింటిలోనూ దేవిపుత్రుడు ఘోర ప‌రాజ‌యంతో రు. 14 కోట్లు లాస్ మిగిల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news