Moviesఆ ఇద్ద‌రి కోసం రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్‌... టాలీవుడ్ హిస్ట‌రీలోనే...

ఆ ఇద్ద‌రి కోసం రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్‌… టాలీవుడ్ హిస్ట‌రీలోనే రికార్డ్‌

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న రాధే శ్యామ్ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మిస్తోన్న సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్‌తో పాటు దీపికా ప‌దుకొణే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో న‌టించేందుకు అమితాబ్ 40 రోజుల కాల్షీట్లు ఇచ్చార‌ట‌. ఇందులో ఆయ‌న నిడివి 25 నిమిషాల పాటు ఉంటుంద‌ని.. ఇందుకోసం ఆయ‌న రు. 25 కోట్లు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమా హీరోయిన్ దీపికా కూడా రు. 25 కోట్లు వ‌ర‌కు డిమాండ్ చేస్తోంద‌ట‌. దీపిక‌తో కూడా అగ్రిమెంట్ పూర్త‌య్యింది. అంటే కేవ‌లం అమితాబ్‌, దీపిక పాత్రల కోస‌మే వైజ‌యంతీ సంస్థ రు. 50 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది. ఇక‌ సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే వీఎఫ్ఎక్స్ కోస‌మే రు. 50 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ సినిమాను రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

ముందుగా కీర‌వాణిని మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా తీసుకోవాల‌ని అనుకున్నా.. ఇప్పుడు ఏఆర్‌. రెహ్మ‌న్ పేరు వినిపిస్తోంద‌ట‌. రెహ్మ‌న్ ఇటీవ‌ల తెలుగులో సినిమాలు చేయ‌లేదు. సుశాంత్‌సింగ్ సినిమాకు చివ‌రగా రెహ్మ‌న్ మ్యూజిక్ ఇవ్వ‌గా ఆ పాట‌లు అన్నీ సూప‌ర్ హిట్ అయ్యాయి. అయితే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మాత్రం త‌న సినిమాకు రెహ్మ‌న్ మ్యూజిక్ ఇస్తేనే బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌.

 

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న రాధే శ్యామ్ ఇటలీలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. ఆ త‌ర్వాత ఈ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా షూటింగ్ ప‌ట్టాలెక్క‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news