Politicsమోదీ బ‌ర్త్‌డేకు వైఎస్సార్‌సీపీ ఎంపీ పూజ‌లు... ఏపీలో అట‌విక రాజ్యం అంటూ...

మోదీ బ‌ర్త్‌డేకు వైఎస్సార్‌సీపీ ఎంపీ పూజ‌లు… ఏపీలో అట‌విక రాజ్యం అంటూ ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు, ఆ పార్టీ నాయ‌కుల‌కు కంట్లో నలుసులా మారిన ఆ పార్టీ అసంతృప్త క‌నుమూరు ర‌ఘురామ కృష్ణంరాజు ప్ర‌తి రోజు కూడా ఢిల్లీ నుంచి వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏకేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ దేశ ప్ర‌ధానిగా మోదీ ఆరున్న‌రేళ్లుగా ఎన్నో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించార‌ని కొనియాడారు.

 

వైసీపీ నుంచి త‌న‌ను బ‌హిష్క‌రించే ద‌మ్ములేకే పార్టీ కార్య‌క్ర‌మాల‌కు పిల‌వ‌డం లేద‌ని అన్నారు. ఇక ఏపీలో అట‌విక రాజ్యం న‌డుస్తోందంటూ ర‌ఘు ధ్వ‌జ‌మెత్తారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు చెడ్డ‌వారిని గుర్తించే శ‌క్తి రావాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇక ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత మిథున్‌రెడ్డి త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు సైతం కౌంట‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news