Moviesబాలీవుడ్ డ్ర‌గ్ కేసులో న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.. ఆ టాప్ హీరోయిన్ కూడా..!

బాలీవుడ్ డ్ర‌గ్ కేసులో న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌.. ఆ టాప్ హీరోయిన్ కూడా..!

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్లు పేర్లు బ‌య‌ట‌కు రాగా ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు భార్య న‌మ‌త్రా శిరోద్క‌ర్ భార్య పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్టు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆమెకు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు విచారణ ఎదుర్కొంటున్న జయసాహా వాంగ్మూలం ఇచ్చార‌ని తెలుస్తోంది.

 

నార్కోటిక్ అధికారుల విచార‌ణ‌లో జ‌య‌సాహో, న‌మ్ర‌త మ‌ధ్య చాటింగ్ జ‌రిపిన‌ట్టు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ర‌కుల్‌ప్రీత్ సింగ్ పేరు మాత్ర‌మే బ‌య‌ట‌కు రాగా ఇప్పుడు మ‌హేష్ భార్య న‌మ్ర‌త పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇండ‌స్ట్రీ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఇక ఇప్ప‌టికే డ్ర‌గ్స్ కేసులో క‌న్న‌డ హీరోయిన్లు సంజ‌న గ‌ల్రానీ, రాగిణి ద్వివేదిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక ఈ కేసులోనే మ‌రో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ దియా మీర్జా పేరు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో నార్కోటిక్ అధికారులు ఆమెకు కూడా స‌మ‌న్లు జారీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news