Gossipsమ‌హేష్‌తో సినిమానా... దండం పెట్టేసిన ఆ ముగ్గురు ద‌ర్శ‌కులు...!

మ‌హేష్‌తో సినిమానా… దండం పెట్టేసిన ఆ ముగ్గురు ద‌ర్శ‌కులు…!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స‌రిలేరు నీకెవ్వరు తర్వాత సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన గీత గోవిందం సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కావ‌డంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రీ ఇప్పుడు మ‌హేష్ కోసం క‌థ‌ను చెక్కి చెక్కీ మ‌రీ ప‌ర‌శురాం ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పొలిటిక‌ల్ సెటైరిక‌ల్‌గా రాబోతుంద‌ని అంటున్నారు.

ఈ సినిమా ఒప్పుకునే ముందు లాక్‌డౌన్ లో ఖాళీగా ఉన్న మ‌హేష్ ఏకంగా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ముగ్గురు ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌ల‌ను రిజెక్ట్ చేయ‌డంతో వాళ్లంతా ఓ మోస్త‌రు క‌థ‌తో మ‌హేష్‌ను ఒప్పించ‌లేం బాబోయ్ అనుకుంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌హ‌ర్షి లాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిప‌ల్లి ఓ సాదాసీదా క‌థ‌తో మ‌హేష్‌ను అప్రోచ్ అవ్వ‌గా రిజెక్ట్ చేశాడు. మ‌ళ్లీ అదే క‌థ‌ను మార్చి చెప్పినా మ‌హేష్‌కు న‌చ్చ‌లేదు.

ఇక ప్ర‌శాంత్ నీల్ చెప్పిన పాన్ ఇండియా క‌థ కూడా మ‌హేష్‌ను ఇంప్రెస్ చేయ‌లేదు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ కూడా మహేష్ కు కథ చెప్పాడట. మ‌హేష్‌తో సినిమా కోసం సందీప్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. దాదాపు యేడాది పాటు వెయిట్ చేశాడు. అయినా ఆ క‌థ కూడా మ‌నోడికి న‌చ్చ‌లేదు. ఏద‌మైనా వ‌రుస హిట్ల‌తో ఉన్న మ‌హేష్ క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌నే అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news