Gossipsపూజ హెగ్డేకు పెరిగిపోయిందా... ఆ టాలీవుడ్ హీరోల‌కు నో చెప్పేస్తోందా...!

పూజ హెగ్డేకు పెరిగిపోయిందా… ఆ టాలీవుడ్ హీరోల‌కు నో చెప్పేస్తోందా…!

క‌న్న‌డ క‌స్తూరి అయినా ఇప్పుడు సౌత్ టు నార్త్‌లో ఓ వెలుగు వెలుగుతోంది పూజా హెగ్డే. వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస‌గా అవ‌కాశాలు కొట్టేస్తోంది. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్ బాబు లాంటి హీరోలు కూడా త‌మ సినిమాల్లో పూజ ఉంటే క్రేజ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారంటే పూజ రేంజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఈ పరిణామంతో పూజా ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ పెంచేసింది. సినిమాకు రు. 2 కోట్ల‌కు త‌క్కువ అయితే తాను సినిమా చేసే ఛాన్స్ లేద‌ని చెప్పేస్తోంద‌ట‌.

అటు స్టార్ హీరోల నుంచి ఇటు మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు ఆమెతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోరుకోవ‌డం కూడా ఆమె కొండెక్కేందుకు కార‌ణ‌మైంది. ఆమెకు పోటీ ఇచ్చే హీరోయిన్లు కూడా లేరు. ర‌ష్మిక మంద‌న్న ఉన్నా ఆమె ఇంకా స్టార్ స్టేట‌స్‌లోకి రాలేదు. ప్ర‌స్తుతం ఆమె రాధేశ్యామ్‌ మూవీలో ప్రభాస్ పక్కన చేస్తోంది. ఈ సినిమా త‌ర్వాత ఆమె సినిమాకు ఏకంగా మూడు కోట్లు తీసుకున్నా ఆశ్చర్యం పోనవసరం లేదని అంటున్నారు. ఆమెకు పోటీ లేక‌పోవడంతోనే రేటు పెంచేస్తుంద‌ని ఇండ‌స్ట్రీలో జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇటీవ‌ల ఇద్ద‌రు మీడియం రేంజ్ హీరోలు సినిమాల్లో న‌టించేందుకు రు. కోటిన్న‌ర  నుంచి రు. 2 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేసినా కూడా ఆమె వాళ్ల‌తో చేసేందుకు ఒప్పుకోలేద‌ట‌. ఆమె మేనేజ‌ర్లు సైతం ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల‌తో చేస్తే క్రేజ్ ప‌డిపోతుంద‌ని ఆమెకు ఎక్కేయ‌డంతోనే పూజ కొండెక్కేసిందంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news