Newsబ్రేకింగ్‌: వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కీల‌క నేత‌

బ్రేకింగ్‌: వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కీల‌క నేత‌

ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలోకి ప‌లువురు కీల‌క నేత‌లు వ‌రుస‌పెట్టి జంప్ చేసేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ర‌మేష్‌బాబుకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఉత్త‌రాంధ్ర వ్య‌వ‌హారాల పార్టీ ఇన్‌చార్జ్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఇక ర‌మేష్‌బాబు యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పెందుర్తి నుంచి ప్ర‌జారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న 2014లో య‌ల‌మంచిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక టీడీపీ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ర‌మేష్ మే నెల‌లోనే పార్టీని వీడారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news