Moviesబ్రేకింగ్‌: గుండెపోటుతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి... ఆ హీరోయిన్‌కు స్వ‌యానా...

బ్రేకింగ్‌: గుండెపోటుతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మృతి… ఆ హీరోయిన్‌కు స్వ‌యానా తండ్రే..

ప్ర‌ముఖ మ‌ళ‌యాళ ద‌ర్శ‌కుడు ఆంటోనీ భాస్క‌ర్ రాజ్ ( 95 ) ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఇంత‌కు భాస్కర్ రాజ్ ఎవ‌రో కాదు తెలుగు, త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో గ‌తంలో హీరోయిన్‌గా ప‌ని చేయ‌డంతో పాటు ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టిస్తోన్న శ‌రణ్యకు స్వ‌యానా తండ్రి. ఈ రోజు మ‌ధ్యాహ్నం భాస్క‌ర్ రాజ్ అంత్య క్రియ‌లు జ‌రుగుతాయి. ఆయ‌న మృత‌తో శ‌ర‌ణ్య కుటుంబంలో విషాద చాయ‌లు అలుముకున్నాయి.

ఇక ఆంటోనీ మృత‌దేహానికి ప‌లువురు సినిమా రంగానికి చెందిన ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. 70కు పైగా సినిమాల‌ను డైరెక్ట్ చేసిన భాస్క‌ర్ రాజ్ శ్రీలంక‌లో ద‌ర్శ‌కుడిగా త‌న కెరీర్ ప్రారంభించారు. వ‌రుస‌గా భారీ హిట్ల‌తో టాప్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. సామాజిక బాధ్య‌త‌ను గుర్తు చేసేలా సినిమాలు తెర‌కెక్కించ‌డంలో ఆయ‌న‌ది అందెవేసిన చేయి. ఇక ఆయ‌న కుమార్తె శ‌ర‌ణ్య భ‌ర్తే మ‌రో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కం విల‌న్ రోల్స్ వేసే సంప‌త్‌రాజ్‌. అయితే వీరికి ఒక కుమారుడు క‌లిగాక విడిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news