Politicsబెడ్ రూంలో ప్రియుడితో న‌గ్నంగా కూతురు... ఈ సీన్ చూసిన త‌ల్లిదండ్రులు...

బెడ్ రూంలో ప్రియుడితో న‌గ్నంగా కూతురు… ఈ సీన్ చూసిన త‌ల్లిదండ్రులు ఏం చేశారంటే..!

బెడ్ రూంలో ప్రియుడితో న‌గ్నంగా రాస‌లీల‌లు కొన‌సాగిస్తోన్న కుమార్తెను చూసిన త‌ల్లిదండ్రులు త‌మ ప‌రువు పోతుంద‌ని ప్రియుడితో సహా కుమార్తెను స‌జీవ ద‌హ‌నం చేశారు. ఈ సంఘ‌ట‌న యూపీలో చోటు చేసుకుంది. ఇటీవ‌ల యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చిన యువ‌తీ, యువ‌కులు త‌మ త‌ల్లిదండ్రుల ప‌రువు తీసే ప‌నులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యూపీలో ఓ యువ‌తి త‌న ప్రియుడితో క‌లిసి త‌ల్లిదండ్రులు ఇంట్లో లేని టైంలో త‌న ప్రియుడిని పిలిపించుకుని రాస‌లీల్లో మునిగితేలుతోంది. ఇంత‌లో బ‌య‌ట నుంచి వ‌చ్చిన తల్లిదండ్రులు కుమార్తెను ఆ భంగిమ‌లో చూసి కోపంతో ర‌గిలిపోయారు.

 

ఆ ఇద్ద‌రిని గ‌దిలో ఉంచి త‌లుపులు వేసి స‌జీవ ద‌హ‌నం చేశారు. ప‌రువు కోస‌మే వారు ఈ హ‌త్య చేసిన‌ట్టు చెపుతున్నారు. బాందా జిల్లా మతౌద్ ఏరియా కర్చా గ్రామానికి చెందిన ప్రియా అదే ప్రాంతానికి చెందిన శంకర్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. శంక‌ర్ ప్రియా ఇంటికి వెళ్లాడు. ఆ టైంలో వీరిద్ద‌రు రాస‌లీల‌ల్లో మునిగిపోయారు. అదే టైంలో వ‌చ్చిన యువ‌తి త‌ల్లిదండ్రులు వీరిని అలా చూసి.. కుమార్తె త‌మ ప‌రువు తీసింద‌న్న కోపంతో ఇద్ద‌రిని లోప‌ల పెట్టి నిప్పుపెట్టారు.

 

ప్రియుడు శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 80 శాతం గాయాలతో ప్రియురాలు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని మిగిలిన కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలు పరువు హత్యలుగా భావిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news