Technologyయూజ‌ర్ల‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్... అలా చేయాలంటే ప‌ప్పులుడ‌క‌వ్‌..!

యూజ‌ర్ల‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్… అలా చేయాలంటే ప‌ప్పులుడ‌క‌వ్‌..!

ప్ర‌ముఖ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా హ‌డావిడి కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఫేస్‌బుక్‌లో ఎక్క‌డ చూసినా క‌రోనా గురించిన రాంగ్ న్యూస్ బాగా వైర‌ల్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు యూజ‌ర్లు స్ప్రెడ్ చేస్తోన్న రాంగ్ పోస్టులు అన్నింటిని ఫేస్‌బుక్ తొల‌గించింది. మొత్తం 70 ల‌క్ష‌ల పోస్టులు తొల‌గించిన‌ట్టు ఫేస్‌బుక్ తెలిపింది. ఏప్రిల్‌, మే, జూన్ నెలల్లో ఈ పోస్టులు డిలీట్ అయ్యాయి.

 

ఈ యేడాది జ‌న‌వ‌రి టు మార్చి మ‌ధ్య 9.6 మిలియ‌న్ల హేట్ న్యూస్‌, రెండో త్రైమాసికంలో 8.7 మిలియ‌న్లు తొల‌గించారు. రెండో త్రైమాసికంలో తొలగించిన పోస్టుల్లో చాలా వ‌ర‌కు టెర్ర‌రిస్టు ఆర్గ‌నైజేష్‌కు చెంద‌నివ‌ని స‌మాచారం. ఈ హేట్ న్యూస్‌ను గుర్తించి తొల‌గించేందుకు ఫేస్‌బుక్ యాజ‌మాన్యం ఆటోమేష‌న్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. అన్ని పోస్టుల‌ను మాన్యువ‌ల్ గా గుర్తించి డిలీట్ చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టే ఈ ఆటోమేటిక్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్నారు.

 

ఇక త‌మ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌ని.. అందువ‌ల్ల ఫేక్ వార్త‌లు, హింస‌ను, అశ్లీల‌త‌ను ప్రేరేపించే పోస్టుల‌కు ఇక్క‌డ చోటు లేద‌ని.. అలాంటి పోస్టుల‌ను డిలీట్ చేసి.. ఆ యూజ‌ర్ల చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేస్తామ‌ని ప్ర‌క‌టించింది. సో ఇక యూజ‌ర్లు చెత్త పోస్టులు పెట్టాలంటే వారి ప‌ప్పులు ఉడ‌క‌వ్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news