Gossipsసరిలేరు నీకెవ్వరులో బెండు తీయనున్న రెండు ఎపిసోడ్స్

సరిలేరు నీకెవ్వరులో బెండు తీయనున్న రెండు ఎపిసోడ్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు అని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో రెండు కీలకమైన ఎపిసోడ్స్ ఉన్నాయని, అవి సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు సాగే ట్రెయిన్‌ సీన్‌లో కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ప్రయత్నం చేశారట చిత్ర యూనిట్. ఈ 30 నిమిషాలే సినిమాకు హైలైట్ కానున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 30 నిమిషాల సీన్ ఫస్టాఫ్‌లో రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

ఇకపోతే సెకండాఫ్‌లో వచ్చే ఎలుకతో కామెడీ సీన్ కూడా నవ్వులు పూయిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఎలుకతో వెన్నెల కిషోర్, సుబ్బరాజులు చేసే కామెడీ మామూలుగా ఉండదని చిత్ర యూనిట్ అంటోన్నారు. ఈ సీన్‌లో వారికి తోడు మహేష్ కూడా తనదైన కామెడీని పండించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు కామెడీ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news