Gossipsఫ్యాన్స్ తో రెచ్చిపోయిన ప్రభాస్..!

ఫ్యాన్స్ తో రెచ్చిపోయిన ప్రభాస్..!

డార్లింగ్ ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీ లో అందరికి ఎంతో ఇష్టమైన హీరో. బాహుబలి సినిమా తో కేవలం భరత్ దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. ఇప్పుడు తన తాజా చిత్రం ‘సాహో’ లో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తో కలిసి నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే దుబాయ్ లో ఒక బారి యాక్షన్ షెడ్యూల్ ని చిత్ర బృందం పూర్తి చేసుకుంది. ఆ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడిన ప్రభాస్ కొన్ని రోజులు విరామం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో అనుష్క కూడా అతన్ని పరామర్శించింది.
ఇక షూటింగ్ సమయంలో సాహో మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ తో ప్రభాస్ చాల సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. సాధారణంగా ప్రభాస్ కి ఎవరైనా బాగా నచ్చితే వారితో చాల క్లోజ్ గా ఉంటారనే విషయం అందరికి తెలిసిందే, అయితే తన అభిమాన కథానాయకుడు మరి ఇంత క్లోజా అని కొంత మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ మేకప్ ఆర్టిస్ట్ బిల్లీ మాత్రం ప్రభాస్ తన పై చూపిన అభిమానానికి ఎంతో ఆనంద పడిందని ఫోటోలు చూస్తే అర్ధం అవుతూనే ఉంది.

https://youtu.be/ogyHGjlVTxY

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news