Movies' గుంటూరు కారం ' ను త్రివిక్ర‌మ్ చుట్టేస్తున్నాడా… బొమ్మ‌ తేడానా…...

‘ గుంటూరు కారం ‘ ను త్రివిక్ర‌మ్ చుట్టేస్తున్నాడా… బొమ్మ‌ తేడానా… ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్ వెన‌క‌..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా గుంటూరు కారం. శ్రీ లీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో షూటింగ్ నత్త‌నడకగా సాగుతోంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో 12 సంవత్సరాల తర్వాత తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్ ప్రకారం మహేష్ – త్రివిక్రమ్ మధ్య అంత సానుకూల వాతావరణంలో షూటింగ్ జరగటం లేదని అంటున్నారు.

మహేష్ పట్టుబట్టి హీరోయిన్ పూజహెగ్డేను మార్పించారని ప్రచారం జరిగింది. అస‌లు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా థ‌మ‌న్‌ను కొనసాగించడం కూడా మహేష్ కు ఇష్టం లేదని అంటున్నారు. ఇక ఈ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియ‌న్ల‌లో కూడా ఇద్దరు ముగ్గురు కూడా మారిపోయారని సమాచారం. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని చెబుతున్న అందుకు అనుగుణంగా షూటింగ్ అయితే జరగటం లేదట. ఫస్ట్ షెడ్యూల్ ఔట్‌ఫుట్ చూసిన తర్వాత మళ్లీ ఈ సీన్లు షూట్ చేయాలని చెప్పడంతో మహేష్ తీవ్ర అసహనంతో ఉన్నారని కూడా తెలుస్తుంది.

ఇద్దరి మధ్య అనుకున్నంత కోఆర్డినేషన్ లేకపోవడంతో త్రివిక్రమ్ కూడా సంక్రాంతి రిలీజ్ నేపథ్యంలో సినిమాను చక చక చుట్టే చేయాలని నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ వాల్లే చెవులు కోరుకొంటున్నారు. వినాయక చవితి లేదా దసరాకు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని అంటున్న ఆ మేరకు తమన్ ఇచ్చిన ట్యూన్ లు కూడా ఏవి బాగోలేదని.. మహేష్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న మహేష్ పుట్టినరోజుకే సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉంది.

కేవలం తమన్‌ ఔట్పుట్ సరిగా లేదని మహేష్ ఓకే చేయలేదు. ఇక ఇప్పుడు అయినా వినాయక చవితి కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని చూస్తున్నా అది ఎంతవరకు కుదురుతుందో చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా త్రివిక్ర‌మ్‌ కూడా ఈ సినిమాపై పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు లేదన్న టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక సినిమా రిసల్ట్ కూడా సక్సెస్ అవుతుందన్న గ్యారెంటీ కూడా చాలామందికి లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news