Moviesప‌వ‌న్ హీరోయిన్ కెరీర్ ఆ స్టార్ డైరెక్ట‌ర్ వ‌ల్లే నాశ‌నం అయ్యిందా…...

ప‌వ‌న్ హీరోయిన్ కెరీర్ ఆ స్టార్ డైరెక్ట‌ర్ వ‌ల్లే నాశ‌నం అయ్యిందా… న‌మ్మించి మోసం చేశాడా…!

టాలీవుడ్‌లో బద్రీ, నాని, నరసింహుడు వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా ద‌గ్గ‌రైన బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్. గత కొంతకాలంగా తెలుగు సినిమాలుకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో ఈమె తాజాగా గదర్2 సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో అమీషా తన గతాన్ని తన పాత రోజులని గుర్తుచేసుకొని ఎంతో బాధపడింది.

అదేవిధంగా తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం బాలీవుడ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ విక్రమ్ భ‌ట్ అని పెద్ద బాంబు కూడాపేల్చింది. ఆయనతో డేటింగ్ చేస్తున్నట్లు బహిరంగంగా చెప్పడం కారణంగానే ఇలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ‘నేను ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటా. కానీ, ఈ ఇండస్ట్రీలో నిజాయితీకి విలువ లేదు. ఓ వ్యక్తికి నా హృదయంలో చోటివ్వడమే నేను చేసిన తప్పు. నిజాయితీగా దాని గురించి బయటకు చెప్పడంతో నా పరిస్థితి ఇలా అయింది.

12-13 ఏళ్లు సినిమా ఛాన్సులు రాలేదు. నా కెరీర్ దెబ్బతింది. దీంతో మరో పురుషుడికి నా లైఫ్ లో చోటివ్వలేదు. ప్రశాంతత మాత్రమే నాతో ఉంది. నా జీవితంలో ఇంకేమీ కోరుకోవట్లేదు’ అని తెలిపింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఆప్ ముఝే అచ్చే లగే సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు.

ఆ సినిమాలో అమీషా పటేల్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా వచ్చాయి. అయితే మధ్యలో ఏం జరిగిందో తెలియదు కానీ అమీషాతో విడిపోతున్నట్లు 2008లో విక్రమ్ భట్ ప్రకటించాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news