Moviesసెప్టెంబర్ 1కి వస్తున్న పైసా వసూల్‌

సెప్టెంబర్ 1కి వస్తున్న పైసా వసూల్‌

నందమూరి అభిమానులకు శుభవార్త. ‘పైసా వసూల్’ కోసం బాలయ్య ముందుగానే వచ్చేస్తు్న్నాడు. గతంలో చెప్పిన తేదీ కంటే 27 రోజుల ముందుగానే సిల్వర్ స్క్రీన్‌ను టచ్ చేయనున్నాడు. ఈ మేరకు ‘పైసా వసూల్’ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ మార్చింది. మొదట సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం ఇప్పుడు ఆ తేదీని సెప్టెంబర్ 1కి మార్చింది.ఈ విషయాన్ని భవ్య క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ‘గ్రాండ్ రిలీజ్ సెప్టెంబర్ ఫస్ట్’ అని ఓ పోస్టర్‌ను కూడా ట్వీట్ చేసింది.బాలకృష్ణని మంచి మాస్ పాత్రలో చూపిస్తూ కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘పైసా వసూల్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన టీజర్ ‘స్టంపర్ 101’కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. బాలయ్య డైలాగులు, మ్యానరిజం కొత్తగా అనిపిస్తున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సాధారణంగా అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయడంతో పూరీ జగన్నాథ్ ఎప్పుడూ విఫలం కాలేదు. తక్కువ సమయంలో చాలా వేగంగా సినిమాలు తీసేస్తుంటారు. ఇప్పుడు బాలయ్య విషయంలో ఒకడుగు ముందుకేసి అనుకున్న తేదీ కంటే ముందుగానే విడుదల చేస్తున్నారు. ‘పైసా వసూల్’లో బాలయ్య సరసన శ్రియ, ముస్కాన్‌, కైరా దత్‌ నటిస్తున్నారు. అలీ, పృథ్వీ, కబీర్‌ బేడి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news