టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్గా 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ పెర్పామెన్స్ ఆడియెన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రిజల్ట్ విషయంలో ట్విస్ట్ ఏంటంటే అప్పట్లో వెండితెర ప్రేక్షకులను ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకున్న అతడు ఆ తర్వాత బుల్లితెరపై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతడు సినిమా తెలుగు బుల్లితెర మీద ఎన్నిసార్లు ప్రసారమైనా మైండ్ బ్లాక్ అయ్యే టీఆర్పీలు సొంతం చేసుకుంది.మహేష్బాబు మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట ఇండియన్ సినిమా హిస్టరీలో చెక్కు చెదరని రికార్డ్ కూడా ఉంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. మహేశ్ ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలైన ఒక్కడు, మురారి, ఖలేజా రీరిలీజ్ లో భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ క్రమంలోనే మహేశ్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న అతడు వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా అతడు క్రేజే ఏమాత్రం తగ్గలేదని ఫ్రూవ్ అవుతోంది.
మరీ ముఖ్యంగా మహేష్ బాబుకు కంచుకోట అయిన ఓవర్సీస్ లో అతడు బుకింగ్స్ పేరుకు తగ్గట్టే సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల కంటే అతడు బుకింగ్స్ బాగున్నాయంటే అతడు ట్రెండ్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. ఇటు ఏపీ, తెలంగాణలోనూ అతడు సాలిడ్ బుకింగ్స్ నమోదు చేస్తోంది. ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70 ఎంఎం స్క్రీన్ పై చూడాలని ఎదురు చూస్తున్నారు. అతడు రీరిలీజ్ 4K థియేట్రికల్ రైట్స్ ను రూ. 3 కోట్లకు పైగా కొనుగులు చేసినట్టు సమాచారం. ఇక నైజాంలో ఈ సినిమాను ఏషియన్ సునిల్ విడుదల చేస్తున్నారు. ఏపీలో ఏరియాల వారీగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ధర వెచ్చించి అతడు రీరిలీజ్ రైట్స్ కొనుగోలు చేసారు. ఒక వైపు బాబు బర్త్ డే మరోవైపు వీకెండ్, సినిమాలు ఏవి లేకపోవడం అతడు రీరిలీజ్ లో రికార్డు స్థాయి నంబర్స్ రాబట్టే అవకాశం ఉంది.
రీ రిలీజ్లో ‘ అతడు ‘ కలెక్షన్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్సలు తగ్గలేదుగా…!
