టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైన్లో రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు ఉన్నాయి. ఇక మారుతి డైరెక్షన్లో హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’లో నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ త్యాగం చేసినట్టు టాక్ ? రాజాసాబ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లు మాత్రమే తీసుకుని రు. 50 కోట్లు త్యాగం చేశాడట. ఇందుకు కారణం ఉంది. గతంలో ప్రభాస్ నటించిన ‘ ఆదిపురుష్ ’ సినిమాతో ఈ నిర్మాతకు నష్టాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ తన రెమ్యునరేషన్ను ఏకంగా రు. 50 కోట్లు తగ్గించుకున్నాడు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది.
ది రాజా సాబ్ కోసం ప్రభాస్ త్యాగం…!
