టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు. పవన్ ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో సినిమాలు.. రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. పవన్ ఇటీవల కాలంలో తన కొడుకు అకీరా నందన్తో కలిసి తరచూ కనిపిస్తూ ఉండడం పవన్ అభిమానులకు.. తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఎగ్జైట్మెంట్ను తీసుకువచ్చింది.పవన్ ప్రస్తుతం ఓజీ – హరిహర వీరమల్లు – ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు చేస్తున్నారు. ఇక పవన్ కొడుకు అకీరా ఎంట్రీ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అకీరా సినీ ఎంట్రీ మరో రెండేళ్ల తర్వాత ఉండబోతోందట. అకీరా డెబ్యూ మూవీ కోసం ఏ దర్శకుడిని తీసుకుంటారనే చర్చ టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లో స్టార్ట్ అయ్యింది.
దీనిపై సరికొత్త రూమర్లు వినిపిస్తున్నాయి. మొట్ట మొదటగా అకీరా డెబ్యూ కోసం పవన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నే పవన్ ఫస్ట్ చాయిస్గా నిలవబోతున్నాడట. త్రివిక్రమ్ కు రెండేళ్ల పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా మీద వర్క్ చేస్తాడు. ఆ తర్వాత అకీరా సినిమా కోసమే త్రివిక్రమ్ తన టీంతో పని చేస్తాడని తెలుస్తోంది.