Moviesప్రియుడితో పెళ్లిపీటలెక్కనున్న ధూత హీరోయిన్‌.. జంట భ‌లే ఉందండోయ్‌..!

ప్రియుడితో పెళ్లిపీటలెక్కనున్న ధూత హీరోయిన్‌.. జంట భ‌లే ఉందండోయ్‌..!

ఈ మధ్య సినీ పరిశ్రమంలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. నటీ నటులు ఒకరి తర్వాత ఒకరు తమ సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి మింగిల్ అవుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కూడా చేరబోతోంది. న్యూస్ ఛానెల్ లో యాంక‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియా భ‌వానీ శంక‌ర్‌.. 2017లో మేయాద మాన్ అనే త‌మిళ సినిమాతో హీరోయిన్ గా మారింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో కోలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

కళ్యాణం కమనీయం మూవీతో టాలీవుడ్ లోకి ప్ర‌వేశించిన ప్రియా భావ‌నీ శంక‌ర్‌.. ఆ త‌ర్వాత‌ గోపీచంద్ కు జోడిగా భీమా చిత్రంలో యాక్ట్ చేసింది. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య డెబ్యూ వెబ్ సిరీస్ ధూత‌లో హీరోయిన్ గా న‌టించి తెలుగు వారికి ప్రియా మ‌రింత చేరువైంది. ఇటీవ‌ల‌ రత్నం, భారతీయుడు 2 చిత్రాల్లో మెరిసిన ప్రియా.. త్వ‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. త‌న చిర‌కాల ప్రియుడితో పెళ్లి పీట‌లెక్క‌బోతోంది.

దాదాపు ప‌దేళ్ల నుంచి రాజ్ అనే వ్యక్తితో ప్రియా భావ‌నీ శంక‌ర్ ప్రేమలో ఉంది. అయితే ఈ జంట త‌మ బంధాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్నారు. తాజాగా ప్రియా భ‌వానీ శంక‌ర్ ఈ గుడ్ న్యూస్ ను స్వ‌యంగా అంద‌రితో పంచుకుంది. తాను సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందునుంచే రాజ్‌తో ల‌వ్ లో ఉన్నాన‌ని.. అయితే తామిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామంటూ ఎన్నోసార్లు పుకార్లు వ‌చ్చాయి.. వాటిని తాము పెద్దగా పట్టించుకోలేద‌ని ప్రియా తెలిపింది.

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన టైమ్ దొర‌క‌లేద‌ని.. కానీ నెక్స్ట్ ఇయ‌ర్ మాత్రం క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటామ‌ని ప్రియా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాజ్‌, ప్రియా జంట భ‌లే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొత్త జీవితం ప్రారంభించ‌బోతున్న ఈ జంట‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news