Moviesయూఎస్‌లో ఆ హీరోయిన్‌తో అల్లు అర్జున్.. రాత్రంతా అక్కడ ఎంజాయ్ చేస్తూ..?

యూఎస్‌లో ఆ హీరోయిన్‌తో అల్లు అర్జున్.. రాత్రంతా అక్కడ ఎంజాయ్ చేస్తూ..?

అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా ఇండస్ట్రీలో నేమ్, ఫేమ్ ఉన్న హీరో.. అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలో ఈయన అల్లు అర్జున్ కూడా ఒకరు.ఇక చాలామంది రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్స్ అయితే బన్నీ మాత్రం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అయితే ఈ సినిమాను అనూహ్యంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. ఈ మూవీతో బన్నీ కి వచ్చిన స్టార్డం అంతా ఇంతా కాదు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాతో ఇప్పటివరకు ఏ హీరో అందుకొని నేషనల్ అవార్డు కూడా బన్నీ అందుకున్నారు.

అయితే అలాంటి అల్లు అర్జున్ నిజంగానే ఆ హీరోయిన్ తో యూఎస్ లో ఎంజాయ్ చేశారా? వైరల్ అయిన రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లతో తెరమీద రొమాన్స్ చేశారు.అల్లు అర్జున్ రొమాన్స్ చాలామంది హీరోయిన్లతో పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇక అల్లు అర్జున్ 2011లో స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లాడారు.వీరికి ఓ కొడుకు ఓ కూతురు కూడా ఉంది. అయితే అల్లు అర్జున్ వివాహ బంధం ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఈయన రియల్ లైఫ్ కాస్త పక్కన పెడితే..సినీ లైఫ్ లో అల్లు అర్జున్ పై అప్పట్లో ఒక రూమర్ మీడియాలో చాలా వైరల్ అయింది.

అల్లు అర్జున్ పూజ హెగ్డే తో యుఎస్ లో ఓ రాత్రి మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాడనే రూమర్ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే..పూజ హెగ్డే,అల్లు అర్జున్ కాంబినేషన్లో దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురంలో వంటి రెండు సినిమాలు వచ్చాయి. అల వైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ దువ్వాడ జగన్నాథం మాత్రం ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు బ్లాక్ బస్టర్ టాక్ దూసుకుపోయింది.

కానీ ఆ తర్వాత ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో సినిమాని ఎలా అయినా హిట్ చేసుకోవాలి అని చిత్ర యూనిట్ యూఎస్ వెళ్లి అక్కడ చిత్ర ప్రమోషన్స్ నిర్వహిస్తూ దువ్వాడ జగన్నాథం సినిమా చూసేలా అక్కడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసినప్పటికీ అది కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఫలితంగా అక్కడికి వెళ్లడానికి ఫ్లైట్ ఖర్చులు నిర్మాత మీద పడ్డాయి. అయితే దువ్వాడ జగన్నాథం సినిమా యూనిట్ మొత్తం యూఎస్‌కి వెళ్లిన సమయంలో అల్లు అర్జున్ పూజ హెగ్డేలు ఓ రాత్రంతా ఎక్కడికో వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు అనే రూమర్ అప్పట్లో టాలీవుడ్లో తెగ చక్కర్లు కొట్టింది.

అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదు అని, చిత్ర యూనిట్ యూఎస్ కి వెళ్ళిన సమయంలో అందరూ కలిసి యూఎస్ అందాలను వీక్షించి వచ్చారు. కానీ బన్నీ, పూజ మాత్రమే వెళ్లారనే రూమర్ వినిపించిందని, ఇందులో ఎలాంటి నిజం లేదు అని అప్పట్లో ఈ రూమర్ విన్న కొంతమంది బన్నీ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news