Moviesఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చెయ్యాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన...

ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చెయ్యాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నిహారిక‌!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓవైపు నటిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు సొంతంగా నిర్మాణ సంస్థను న‌డుపుతున్న సంగతి తెలిసిందే. కొత్త‌వారిని ప్రోత్స‌హిస్తూ నిహారిక ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ ఫిల్మ్ కమిటీ కుర్రోళ్లు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే క‌థాశంతో డైరెక్ట‌ర్‌ య‌దు వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఇందులో సాయి కుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు.

ఆగ‌స్టు 9న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే కమిటీ కుర్రోళ్లు మూవీని నిహారిక గ‌ట్టిగా ప్ర‌మోట్ చేస్తోంది. అయితే ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిహారిక‌.. త‌న‌కు ఇష్ట‌మైన హీరో గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మెగా హీరోలు కాకుండా మీకు ఇష్ట‌మైన యాక్ట‌ర్ ఎవ‌రు? అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా.. ప్ర‌భాస్ అని నిహారిక బదులిచ్చింది.

ప్ర‌భాస్ తో ఒక్క‌సారైనా క‌లిసి యాక్టింగ్ చెయ్యాల‌ని ఉందంటూ నిహారిక తెలిపింది. ప్రభాస్ కామెడీ అంటే త‌న‌కు ఎంతో ఇష్టమ‌ని.. ప్ర‌భాస్ న‌టించిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు నా మోస్ట్ ఫేవ‌రెట్ అని పేర్కొంది. ఒకవేళ అలాంటి సినిమా ఆయనతో చేసే అవ‌కాశం వస్తే అస్స‌లు వ‌దులుకోన‌ని నిహారిక త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. మ‌రి ప్ర‌భాస్ తో యాక్ట్ చేసే అవకాశం ఫ్యూచ‌ర్‌లో నిహారిక‌కు వ‌స్తుందో..లేదో.. చూడాలి.

కాగా, నిహారిక వెండితెర‌పై క‌నిపించి చాలా కాలం అయిపోయింది. చివ‌ర‌గా 2019లో విడుద‌లైన సైరా నరసింహా రెడ్డిలో నిహారిక చిన్న పాత్ర‌లో మెరిసింది. ఆ త‌ర్వాత ఆమె నుంచి మ‌రో సినిమా రాలేదు. అయితే గ‌త ఏడాది డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా న‌టిగా రీఎంట్రీ ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం వాట్ ది ఫిష్ అనే మూవీ చేస్తోంది. అలాగే మలయాళ నటుడు షేన్ నిగమ్ తో క‌లిసి మద్రాస్కారన్ అనే త‌మిళ మూవీలో కూడా నిహారిక న‌టిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news