Moviesకృష్ణ కూతురు మంజుల హీరోయినైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానని బెదిరించిందెవరు.?

కృష్ణ కూతురు మంజుల హీరోయినైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానని బెదిరించిందెవరు.?

టాలీవుడ్ సూపర్ స్టార్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సీనియర్ హీరో కృష్ణ మాత్రమే.ఆయన తర్వాత ఆయన వారసుడు ఇప్పుడు మహేష్ బాబుని అందరూ సూపర్ స్టార్ గా పిలుచుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ కి ఐదుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు సినిమాల్లో హీరోగా రానిద్దాం అనుకున్నప్పటికీ వర్కౌట్ అవ్వలేదు.కానీ మహేష్ బాబు మాత్రం స్టార్ హీరో అయ్యారు. ఇక మహేష్ బాబు కూతురు మంజుల హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కన్నదట.ఇంట్లో వాళ్ళు కూడా ఆమె డ్రీమ్ ని కాదనలేదు.

అలా మంజుల హీరోయిన్ కావడానికి కృష్ణ,మహేష్ బాబు, విజయనిర్మల, ఇందిరాదేవిలు ఎంత గానో సహకారం అందించారు. ఇక కృష్ణ కి అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి మంజులని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ బాలకృష్ణతో ఓ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఈ విషయం మొత్తం కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ మీడియా మొత్తం వ్యాపించింది. మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అనే సమయంలో కృష్ణ అభిమానులు అందరూ రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేశారు.

మా అభిమాన హీరో కూతురు వేరే హీరోతో రొమాన్స్ చేయడం మేము అస్సలు సహించలేం. మంజుల మాకు చెల్లెలు లాంటిది. వేరే హీరోతో రొమాన్స్ చేస్తే మేము ఒప్పుకోము.. మంజులని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి వీల్లేదు. అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ సృష్టించారు.
అంతేకాదు బందర్ లో ఎస్వి కృష్ణారెడ్డికి సంబంధించిన ఒక కటౌట్ ఉంటే దాన్ని తీసేసి కాలువలో పడేసారట కొంతమంది కృష్ణ అభిమానులు.

ఇక ఓ వ్యక్తి అయితే మంజులని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే మాత్రం నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను అంటూ బెదిరించారట. దాంతో ఈ అల్లర్లన్ని చూసినా మహేష్ బాబు, కృష్ణలు మంజులని హీరోయిన్ చేయాలని ప్రయత్నాన్ని మానుకున్నారట.ఇక మంజుల కూడా హీరోయిన్ అవుదామని ఎన్నో కలలు కన్నదట. కానీ కృష్ణ అభిమానులు చేసిన పనికి ఆమె తన కోరిక తీర్చుకోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news