Moviesనిహారిక సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి నో స‌పోప్ట్‌.. అస‌లు కారణం...

నిహారిక సినిమాకు మెగా ఫ్యామిలీ నుంచి నో స‌పోప్ట్‌.. అస‌లు కారణం ఏంటి..?

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ నుంచి విడిపోయిన త‌ర్వాత కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు న‌టిగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాత‌గా స‌త్తా చాటుతోంది. నిహారిక ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ కమిటీ కుర్రోళ్లు. య‌దు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

గ్రామీణ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న కమిటీ కుర్రోళ్లు చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌ల‌ను నిహారిక త‌న భుజాల‌పై వేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసింది. అయితే నిహారిక నిర్మించిన ఈ చిత్రానికి మెగా ఫ్యామిలీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క‌రూ స‌పోర్ట్ ఇవ్వ‌లేదు. సొంత ఫ్యామిలీలో ఎంద‌రో స్టార్స్ ఉన్నా నిహారిక మాత్రం సింగిల్ గానే క‌ష్ట‌ప‌డుతోంది.

ఈ విష‌యంపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్నించ‌గా.. నిహారిక అందుకు కార‌ణమేంటో వివ‌రించింది. నిహారిక మాట్లాడుతూ.. నా సినిమా ప్రమోషన్స్ కి మా నాన్నే దొరకట్లేదు. ఇక పెదనాన్న ఏం దొరుకుతారు. పాలిటిక్స్ వ‌ల్ల నాన్న మంగళగిరిలోనే ఉంటున్నారు. క‌నీసం ఇంటికి కూడా రావట్లేదు. అన్న వ‌రుణ్ వైజాగ్ లో త‌న అప్ క‌మింగ్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు. మా వదిన లావ‌ణ్య‌కి కాలు ఫ్రాక్చర్ కావ‌డంతో డెహ్రాడూన్ లో ఉంది.

కళ్యాణ్ బాబాయ్ కూడా పాలిటిక్స్ లో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. ఇక చరణ్ అన్న, పెదనాన్న పారిస్ ఒలంపిక్స్ కి వెళ్లారు. నా సినిమా వ‌చ్చే టైమ్‌కి అందరూ బిజీ అయిపోయి త‌ప్పించుకున్నారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. వారంతా కాస్త ఫ్రీ అయ్యాక కమిటీ కుర్రోళ్లు మూవీని వాళ్ల‌కు చూపిస్తాన‌ని తెలిపింది. బిజీగా ఉండ‌టం వ‌ల్లే త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అందుబాటులోకి రాలేద‌ని నిహారిక స్ప‌ష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news