Moviesమ‌హేష్ బాబు క‌న్నా ముందు న‌మ్ర‌త ల‌వ్ చేసింది ఎవ‌ర్ని.. అత‌నితో...

మ‌హేష్ బాబు క‌న్నా ముందు న‌మ్ర‌త ల‌వ్ చేసింది ఎవ‌ర్ని.. అత‌నితో బ్రేక‌ప్‌కు రీజ‌న్ ఏంటి?

నమ్రతా శిరోద్కర్.. ఇప్పుడంటే మ‌హేష్ బాబు భార్య‌. కానీ ఒక‌ప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన న‌మ్ర‌త 1993 లో మిస్ ఇండియాగా ఎంపికైంది. మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆరవ స్థానంలో నిలిచింది. మేరే దో అన్మోల్ రతన్ మూవీతో హీరోయిన్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టింది.

బాలీవుడ్ లో ఇరవైకి పైగా చిత్రాల్లో న‌టించింది. వంశీ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా స‌మ‌యంలో మ‌హేష్ బాబుతో ప్రేమలో ప‌డిన న‌మ్ర‌త‌.. 2005 ఫిబ్ర‌వ‌రి 10న ముంబైలో అత‌నితో క‌లిసి ఏడుగులు వేసింది. పెళ్లి త‌ర్వాత న‌మ్ర‌త సినిమాల‌కు దూర‌మై సంపూర్ణ గృహిణిగా మారింది. గౌత‌మ్‌, సితార‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం పిల్ల‌ల బాధ్య‌తతో పాటు భ‌ర్త వ్యాపారాల‌ను, నిర్మాణ సంస్థ‌ను చూసుకుంటోంది.

పెళ్లై దాదాపు రెండు ద‌శాబ్దాలు కావొస్తున్నా.. ఎటువంటి మనస్పర్ధలకు చోటివ్వ‌కుండా మ‌హేష్‌, న‌మ్ర‌త జంట‌ సంతోషంగా జీవితం గడుపుతున్నారు. ప‌ర్ఫెక్ట్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. న‌మ్ర‌త ఫ‌స్ట్ ల‌వ్ మ‌హేష్ బాబు కాదు. మ‌హేష్ క‌న్నా ముందే న‌మ్ర‌త ఒక వ్య‌క్తిని ల‌వ్ చేసింద‌నే ప్ర‌చారం నార్త్ ఇండ‌స్ట్రీలో బ‌లంగా ఉంది.

బాలీవుడ్ లో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలో దీపక్ శెట్టి అనే రెస్టారెంట్ ఓనర్ తో న‌మ్ర‌త‌ ప్రేమలో పడిందట. ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌ని భావించార‌ట‌. కానీ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే విడిపోయారు. ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తలెత్త‌డంతో దీప‌క్ శెట్టికి న‌మ్ర‌త బ్రేక‌ప్ చెప్పింద‌ట‌. ఆ త‌ర్వాత అత్యంత సౌమ్యుడైన మ‌హేష్ బాబుతో ల‌వ్ లో ప‌డిన న‌మ్ర‌త‌.. అత‌నితోనే జీవితాన్ని పంచుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news