Moviesఆ హీరోయిన్ వల్లే రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకులు తీసుకోవాలనుకున్నారా..?

ఆ హీరోయిన్ వల్లే రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడాకులు తీసుకోవాలనుకున్నారా..?

సీనియర్ నటి రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి మరీ పెళ్లాడింది.. అయితే ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఒకానొక సమయంలో విడాకుల వార్తలను ఎదుర్కొన్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు అంటారు చాలామంది పెద్దలు. అయితే వీరి విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే వీరు గతంలో విడాకులు తీసుకోవాలనుకున్నారనే వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంతలా కుదిపేసిందో చెప్పనక్కర్లేదు. ఇక ఈ విషయం తెలిసిన కొంతమంది సినీ పెద్దలైతే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని ఆశ్చర్యపోయారు.

ఇక అప్పట్లో రమ్యకృష్ణ తన భర్తకి దూరంగా హైదరాబాద్ వదిలి చెన్నైకి కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిందనే టాక్ కూడా వినిపించింది. అయితే అదృష్టవశాత్తు వీరిద్దరూ విడాకులు తీసుకోలేదు.కానీ వీరు విడాకుల వరకు వెళ్లడానికి ఓ హీరోయిన్ కారణమని అప్పట్లో ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ తెగ వైరల్ అయింది.ఇక హీరోయిన్ ఎవరో కాదు ఛార్మి.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం మూవీలో హీరోయిన్ గా ఛార్మి నటించింది.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కృష్ణవంశీ తో ఛార్మి క్లోజ్ గా ఉండడం చూసి రమ్యకృష్ణ అస్సలు సహించలేదట. దాంతో ఇంటికి వెళ్లాక ఇద్దరి మధ్య తరచూ గొడవ జరుగుతుండేదట. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయాక వీరి గొడవలు తారా స్థాయికి వెళ్ళాయి.

అయినప్పటికీ కృష్ణవంశీ మళ్లీ తాను దర్శకత్వం వహించే రాఖీ మూవీలో కూడా ఛార్మిని హీరోయిన్ గా తీసుకున్నారు.అలా ఆ హీరోయిన్ మీద ప్రేమ ఉంటేనే కృష్ణవంశీ అలా చేస్తున్నారని రమ్యకృష్ణ కొద్ది రోజులు హైదరాబాద్ వదిలేసి కొడుకుని తీసుకొని చెన్నై వెళ్లిపోయిందట. ఆ తర్వాత బంధువులు, ఇంట్లో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా.నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అని సర్ది చెప్పారట. ఆ తర్వాత కొద్ది రోజులకు రమ్యకృష్ణ రియలైజ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ వచ్చిందట. ఇక ఆ సమయంలోనే రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకోబోతున్నారు అనే రూమర్ చాలా వైరల్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news